NewsInn

News in a Click

ప్ర‌ధాని కార్య‌క్ర‌మాల‌కు ముఖ్య‌మంత్రికి ఆహ్వానం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నిర్వ‌హించ‌నున్న ప‌లు ప్రాజెక్టుల ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానించింది. వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభోత్స‌వం, హైద‌రాబాద్‌-ప‌నాజీ ఎకాన‌మిక్ కారిడార్‌లోని గుడెబల్లూర్‌-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నాలుగు వ‌రుస‌ల ర‌హ‌దారి నిర్మాణానికి శంకుస్థాప‌న‌, కాజీపేట‌-విజ‌య‌వాడ మ‌ల్టీ ట్రాకింగ్ ప‌నుల‌ను హైద‌రాబాద్ హెచ్ఐసీసీ వేదిక‌గా ప్రధానమంత్రి ఆదివారం వ‌ర్చువ‌ల్‌గా చేప‌ట్ట‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ ర‌హ‌దారుల శాఖ రీజిన‌ల్ ఆఫీస‌ర్ కృష్ణ‌ప్ర‌సాద్ ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వాన ప‌త్రిక అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *