NewsInn

News in a Click

బండి ఫిర్యాదు రివ‌ర్స్…మ‌రింత ఇరుకున భ‌గీర‌థ్

బండి ఫిర్యాదు రివ‌ర్స్…మ‌రింత ఇరుకున భ‌గీర‌థ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కేంద్ర మంత్రి బండి సంజ‌య్ త‌న‌యుడు బండి భ‌గీర‌థ్ పోలీసుల‌కు చేసిన ఫిర్యాదు భ‌గీర‌థ్ ను మ‌రింత ఇర‌కాటంలో వేసింది. ఓ మైన‌ర్ బాలిక‌తో క‌లిసి తిరిగిన‌ట్లు క‌రీంన‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పాటు….. ఆ బాలిక కుటుంబానికి 50 వేల రుపాయ‌లు ఇచ్చాన‌ని, త‌న‌ను బ్లాక్ మేయిల్ చేసేందుకు మైన‌ర్ బాలిక కుటుంబ స‌భ్యులు వేధిస్తున్నార‌న్న‌ది భ‌గీర‌థ్ చేసిన ఫిర్యాదు సారాంశం. అయితే ఇదే స‌మ‌యంలో ఆ మైన‌ర్ బాలిక‌తో క‌లిసి తిరిగిన‌ట్లు ఫిర్యాదు చేయ‌డం అస‌లుకే ఎస‌రు తెచ్చేలా క‌నిపిస్తోంది. ఇదే అంశాన్ని అస‌రాగా చేసుకున్న బండి సంజ‌య్ స్లైల్ లోనే బీజేపీ ని ఇరుకాటంలో పెట్టే ప్ర‌య‌త్న ఇత‌ర రాజ‌కీయ పార్టీలు చేస్తున్నాయి. పోలీసులు మాత్రం ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు వాస్త‌వాల‌ను వెల్ల‌డించ‌క‌పోవ‌డం విశేషం. కేంద్ర మంత్రి త‌న‌యుడిపై ఫిర్యాదు దేశ వ్యాప్తంగా చ‌ర్చనీయంశంగా మారిన ఈ కేసు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. సోష‌ల్ మీడియాలో బండి ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు క‌నిపిస్తున్నాయి.

కేసు నిస్ఫాక్షింగా విచార‌ణ జ‌రుపుకోవ‌లంటే కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించాలని, లేదంటే బండి స్వ‌యంగా త‌ప్పుకోవాల‌న్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధానమంత్రి ప‌ర్య‌ట‌న‌కు ఈ ఘ‌ట‌న న‌మోదు కావ‌డంతో బీజేపీ శ్రేణుల్లోనూ తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. కేంద్ర మంత్రి సంజ‌య్ పేరును ప్ర‌ధాని మోడీ పాల్గొనే కార్య‌క్ర‌మాల నుంచి తొల‌గించారు. ఆహ్వాన ప‌త్రిక‌ల్లో బండి సంజ‌య్ పేరు లేకుండానే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. బీజేపీ నేత‌లు ఎవ‌రు బండికి మ‌ద్ద‌తుగా ఒక్క వాద‌న వినిపించ‌డం లేదు. క‌నీసం బండి భ‌గీర‌థ్ చేసిన ఫిర్యాదుపై స్పందించేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు.గ‌తంలో మాజీ హోమంత్రి మ‌హ్మూద్ అలీ మ‌నువ‌డిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను మీడియా స‌మావేశాల‌ను ఏర్పాటు చేసి ఎండ‌గ‌ట్టిన బీజేపీ నేత‌లు ఇప్పుడు మాత్రం సైలెంట్ కావ‌డం విశేషం. బండి త‌న‌యుడు భ‌గీర‌థ్ ఆ యువ‌తితో ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో లేకుండానే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఈ వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ సీరియ‌స్ గా స్పందిస్తోంది. బండి సంజ‌య్ త‌ర‌చూ బీఆర్ ఎస్ ను టార్గెట్ చేయ‌డంతో..ఇప్పుడు బీఆర్ ఎస్ పార్టీకి క‌లిసి వ‌చ్చిన అస్త్రంగా మారింది. సంజ‌య్ ను ఇరుకున పెట్టేందుకు గులాబీ పార్టీ పావులు క‌దుపుతోంది. ఈ విష‌యంలో కాంగ్రెస్ నేత‌లు కూడా రాజ‌కీయంగా ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోవ‌డం విశేషం. కేసు ను నీరుగార్చే య‌త్నాల్లో భాగంగా కాంగ్రెస్, బీజేపీలు కలిసి పోయాయ‌ని బీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. మొత్తం మీద మైన‌ర్ బాలిక‌తో త‌న‌కు ప్రెండ్షిప్ ఉంద‌న్న విష‌యం భ‌గీర‌థ్ అధికారికంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం బండి సంజ‌య్ దూకుడును డిఫెన్స్ లో వేసిన‌ట్లు అయింది. గ‌తంలో కూడా బండి భ‌గీర‌థ్ ఇరుక్కున్న వివాదాల‌కు సంబంధించి, ఫోటోలు వీడియాలో మ‌రో సారి వైర‌ల్ గా మారాయి.

ఇది ముమ్మాటికి కుట్ర‌…..బండి సంజ‌య్….

నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజ‌య్ ఎక్స్ లో స్పందించారు.

నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను.

నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుంది.

ఏది నిజం……

అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్ గా, నేడు ఎంపీగా ఎన్నికై, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి.

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యం.

తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం నాకుంది.

సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుంది, ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది.

సత్యమేవ జయతే అని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *