(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ముంబాయిని తక్కువ స్కోరుకే కట్టడి చేసినా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆ లక్ష్య ఛేదనకు ఇబ్బందులు పడింది. బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించని ఈ పిచ్ పై ముంబాయి జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. గెలువాల్సిన మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ చివరి ఓవర్లో కూడా వత్తిడితో బౌలర్ వైడ్లు, నోబ్ లతో బెంగుళూరుకు టెన్షన్ సగం తగ్గించారు. కానీ 19 ఓవ ఓవర్ బూమ్రా, 20 వ ఓవర్ బావాలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ వత్తిడిలో పరుగులు చేసేందుకు తడబడింది. చివరి ఓవర్లో ఎక్స్ ట్రాల రూపంలో బెంగుళూరుకు కలిసి వచ్చింది. నాలుగో బంతికి సిక్స్ కొట్టడంతో ఆర్సీబీ విజయానికి చేరువైంది. మరో బంతి కి పరుగులు రాకపోవడంతో చివరి బంతికి రెండుపరుగులు చేయాల్సి వచ్చింది. చివరి బంతికి రెండు పరుగులు సాధించడంతో ఆర్సీబీ విజయం దక్కించుకుంది.

167 పరుగుల లక్ష్యంగా బరిలో దిగిన బెంగుళూరుకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతికే ఎలాంటి పరుగులు చేయకుండా వెనుదిరిగారు. జాకబె బేథల్, దేవదత్ పడిక్కల్ లు కలిసి కొద్ది సేపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు పడిక్కల్ 10 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. 3 ఓవర్లలో బెంగెళూరు కూడా 24 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఫాంలో ఉన్న రజత్ పాటిదార్ కూడా 39 పరుగల వద్ద, బేథెల్ 94 పరుగుల వద్ద ఔటయ్యరు. దీంతో బెంగుళూరు 13 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 94 పరుగులు మాత్రమే చేసిన 27 బంతులు ఎదుర్కొని 27 పరుగులే బెథెల్ చేశారు. పాటిదార్ 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కృనాల్ పాండ్య, జితేష్ శర్మలు విలువైన భాగస్వామ్యం అందించారు. 131 పరుగుల వద్ద ఆర్సీబీ జితేష్ శర్మ వికెట్ కోల్పోయింది. ఆ తరువాతి బంతికే టిం డేవిడ్ కూడా ఔట్ కావడంతో మరోసారి ఆర్సీబీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. 131 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. కృనాల్ క్రీజులో నిలదొక్కుకుని భారీ షాట్లు ఆడుతుండడంతో బెంగుళూరు మ్యాచ్ గెలిచే అవకాశాలు కనిపించాయి.18వ ఓవర్ చివరి బంతికి కృనాల్ పాండ్య 75 పరుగులు చేసి ఔట్ కావడంతో ఆర్సీబీ చిక్కుల్లో పడింది. కృనాల్ 46 బాల్స్ ఎదుర్కొని 5 సిక్స్ లు 4 ఫోర్లతో 73 పరుగులు చేసి ఔటయ్యారు. చివరి ఓవర్లో 15 పరుగులు ఆర్సీబీకి చేయాల్సి వచ్చింది. కార్డిన్ బుష్ 4 వికెట్లు తీసుకుని ఆర్సీబీని ఆత్మరక్షణలో వేశారు.

ఇన్నింగ్స్ మొదటి నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూ పడుతూ లేస్తూ…. పరుగులు సాధించింది. రియాన్ రికెల్టన్ 4 పరుగుల వద్ద, రోహిత్ శర్మ 28 పరుగుల వద్ద, సూర్యకుమార్ అదే స్కోరు వద్ద ఔట్ కావడంతో 28 పరుగులకే ముంబాయి 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆతరువాత బ్యాటింగ్ కువచ్చిన తిలక్ వర్మ, నమన్ ధీర్ లు కొద్ది సేపు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బౌలర్లను ఎదుర్కొంటూ పరగులు చేయగలిగారు. మరో వికెట్ నష్టపోకుండా 13 ఓవర్లలో 110 పరుగులకు స్కోరును చేర్చారు. అక్కడ నమన్ ధీర్ 32 బాల్స్ ఎదుర్కొని 47పరుగులు చేసి ఔటయ్యారు మరో వైపు తిలక్ వర్మ క్రీజులో నిలదొక్కుకున్నట్లే కనిపించారు. కానీ ముంబాయి బ్యాటర్లు భారీ స్కోరు సాధించే లక్ష్యంగా ప్రయత్నాలు చేసి వెంట వెంటనే వికెట్లు కోల్పోయారు. విల్ జాక్స్ 132 పరుగుల వద్ద, తిలక్ వర్మలు 155 పరుగుల వద్ద ఔటయ్యారు. జాక్స్ 10 పరుగుల చేయగా తిలక్ 42 బాల్స్ ఎదుర్కొని 57పరుగులు చేసి వెనుదిరిగారు. ఇదే ముంబాయి జట్టులో అత్యధిక స్కోరు. 19 వ ఓవర్లో 161 పరుగల వద్ద 7 వికెట్ ను ముంబాయి కోల్పోయింది.













Leave a Reply