(హైదరాబాద్,న్యూస్ఇన్)
చెన్నై హోంగ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లక్నో సూపర్ జెంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది.చివరి ఓవర్ వరకు మ్యాచ్ వెళ్లింది. నాలుగు బంతులు మిగిలి ఉండగా చెన్నై 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి లక్నో పై విజయం సాధించింది.బ్యాటింగ్ మొదలు పెట్టిన చెన్నై కూడా ధాటిగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వడ్ లు 4 ఓవర్లలో 45 పరుగులు చేసి తొలి వికెట్ సంజు రూపంలో కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన ఊర్విల్ పటేల్ లక్నో బౌలర్లపై విరుచుకు పడ్డారు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. వరుసగా సిక్స్ లు, ఫోర్లు కొట్టి స్కోరు ను ధాటిగా పెంచారు. 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఊర్విల్ 8 సిక్స్ లు , 2 ఫోర్లతో 65 పరుగులు చేసి వెనుదిరిగారు. దీంతో లక్నో బౌలర్లకు చెన్నై పై వత్తిడి పెంచేందుకు అవకాశం దక్కింది.9.2 ఓవర్ల వద్ద 126 పరుగులు దగ్గర ఊర్విల్ పటేలో రెండో వికెట్ రూపంలో ఔటయ్యారు. ఆ తరువాత చెన్నై కూడా వరుసగా వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. కార్మిక శర్మ, బ్రేవిస్ ప్రశాత్ వీర్ లు వెంట వెంటనే ఔటయ్యారు. దీంతో చెన్నై పై మరింత వత్తిడి పెరిగింది. దిగ్వేష్ రాఠి 2, షాబాజ్ అహ్మద్ 2 వికెట్లు, ఆవేష్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు.చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండడంతో లక్నో బౌలర్లకు అది సాధ్యం కాలేదు. తొలి రెండు బంతులు వైడ్ రూపంలో వచ్చాయి. దీంతో ఆరు బంతుల్లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది. శిశం దుబూ క్రీజులో ఉండడంతో రెండు సిక్స్ లు కొట్టి మ్యాచ్ ను ముగించారు.
ఆకట్టుకున్న ఊర్విల్ ఇన్నింగ్స్…….

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఇన్నింగ్స్ ధాటిగా మొదలు పెట్టింది. లక్నో ఓపెనర్లు శుభారంభాన్ని అందించినా మిడిల్ ఆర్డర్ దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. చివర్లో బ్యాటర్లు మెరుపులు మెరిపించడంతో 200 పరుగుల మైలు రాయిని దాటింది.5 ఓవర్లలోనే లక్నో జట్టు ఓపెనర్లు మిచెల్ మార్స్, జోష్ ఇంగ్లీష్ లు చెన్నై బౌలర్లపై విరుచుకు పడ్డారు. పవర్ ప్లేలోని 5 ఓవర్లలోనే 77 పరుగులు సాధించారు. 6వ ఓవర్ తొలి బంతికి మిచెల్ మార్ష్ వెనుదిరిగారు. దీంతో ఆ తరువాత క్రమంగా లక్నో వికెట్లు పడుతూ వచ్చాయి. మర్ష్ తన వైఖరికి భిన్నంగా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేశారు. 10 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేశారు. మరో వైపు ఇంగ్లీష్ 33 బంతులు మాత్రమే ఎదుర్కొని 85 పరుగులు సాధించారు. దీంట్లో 10 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. మార్ష్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పూరన్ ఒకే పరుగు చేసి వెనుదిరిగారు. 10 వ ఓవర్లో ఇంగ్లీష్ ఔట్ కావడంతో చెన్నై బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత వరుస ఓవర్లలో లక్నో వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు బ్యాటింగ్ చేస్తున్న ప్పుడు జట్టు స్కోరు 250 పరుగుల వద్దకు చేరుకున్న ఆశ్చర్య పోవాల్సిన పని లేదన్నట్లుగా మారింది. రిషబ్ పంత్, రఘువంశీ, మార్కరం లు తక్కువ పరుగులు చేసి వెనుదిరిగారు. చివర్లో షాబాజ్ అహ్మద్ 25 బాల్స్ ఎదుర్కొని 43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. దీంతో 20ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. జెమీ ఓవర్టన్ 3, అన్షుల్ కాంభోజ్ 2 వికెట్లు తీసుకున్నారు.











Leave a Reply