20న రానున్న ఉపరాష్ట్రపతి
ఏర్పాట్లపై అధికారుల దృష్టి
(హైదరాబాద్, న్యూస్ఇన్)
శీతాకాల విడిదికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు.మ.2.25 గంటలకు హకీంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా గవర్నర్, మంత్రులు, ఉన్నతాధికారులు హకీంపేట్ ఏర్పాటుకు వెళ్లి స్వాగతం పలుకారు. ఐదు రోజులపాటు హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో 5 రోజులు బసత్ చేస్తారు.19వ తేదీన రామోజీ ఫిల్మ్సిటీలో ఆలిండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల..జాతీయ సదస్సు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. 20న గచ్చిబౌలి శాంతి సరోవర్ సదస్సుకు రాష్ట్రపతి ముర్ము హాజరు అవుతారు. ఈ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు ఈ నెల 22 వరకు అల్వాల్, గచ్చిబౌలి పరిధిలో..డ్రోన్లు, పారా గ్లైడర్స్, మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఎగురవేతపై నిషేధం విధించారు…

భారత ఉప రాష్ట్రపతి సి.పీ.రాధకృష్ణన్ హైదరాబాద్ లో ఈనెల 20 ,21తేదీల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 20 వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడనుండి నేరుగా రామోజీ ఫిలిం సిటీ కి వెళ్తారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొని లోక్ భవన్ లో రాత్రి బస చేస్తారు. 21 వ తేదీ ఉదయం కన్హా శాంతి వనంలో ఏర్పాటుచేసిన ప్రపంచ ధ్యాన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని అక్కడినుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని న్యూఢిల్లీ తిరిగి వెళ్తారు. కాగా, ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. బందోబస్తు ఏర్పాట్లు, ఉప రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో రహదారుల నిర్వహణ, ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లపై సమీక్షించారు. ఉప రాష్ట్ర పతి పర్యటనకు ఏ విధమైన లోటు జరగాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ఇద్దరు హైదరాబాదులో ఒకే సారి ఉంటుండడంతో ఉన్నతాధికారులు ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.




Leave a Reply