(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ ఇన్)
రెండు అగ్రశ్రేణి జట్ల మద్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ తడబడుతూ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. 15 ఓవర్లలో సన్ రైజర్స్ కేవలం 86 పరుగులు చేసి అలౌట్ అయింది. బ్యాటింగ్ మొదలు పెట్టిన గుజరాత్ కు శుభారంభం దక్కలేదు.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు మాత్రమే చేసింది. ఫాంలో ఉన్న గిల్, జోస్ బట్లర్ లు 5, 7 పరుగులు చేసి వెనుదిరిగారు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ క్రీజులో నిలదొక్కుకుంటూ…. కొత్త బ్యాటర్లతో కలిసి స్కోరు పెంచే యత్నం చేస్తూ వచ్చారు.10 ఓవర్లలో 64 పరుగులు చేసిన గుజరాత్ 3వ వికెట్ కోల్పోయింది. నిషాంత్ సాధు 22 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్, సుదర్శన్ లు జట్టు స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. 16.2 ఓవర్ల వరకు 4వ వికెట్ భాగస్వామ్యం లో 60 పరుగులు చేసి అక్కడ సాయి సుదర్శన్ 44 బాల్స్ ఎదుర్కొని 61 పరుగులు చేసి ఔటయ్యారు. మరో వైపు క్రీజులో నిలదొక్కుకున్న సుందర్ కూడా సన్ రైజర్స్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. 33 బంతులు మాత్రమే ఎదుర్కొని 50 పరుగులు చేసి సుందర్ నాటౌట్ గా నిలిచారు. రాహూల్ తేవాటియా 4 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
సాయి సుదర్శన్ బ్యాటింగ్….

169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ మొదటి ఓవర్ నుంచే తడబడింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల వికెట్లు 6 పరుగుల లోపే గుజరాత్ బౌలర్లు తీసుకున్నారు. ఆ తరువాత ఎక్కడా కూడా సన్ రైజర్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. అతి తక్కువ స్కోరు ఛేదించే క్రమంలో కూడా వరుసగా సన్ రైజర్స్ వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్ల వరకే కేవలం 56 పరుగులు చేసి సగం వికెట్లను ఎస్ ఆర్ హెచ్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ 11,రవిచంద్రన్ 9, క్లాసెన్ 14 పరుగుల చేసి వెనుదిరిగారు. దీంతో ఇక మ్యాచ్ చేజారినట్లు భావించిన హైదరాబాద్ బ్యాటర్లు ఆచితూచి ఆడే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ తరువాత కూడా వికెట్లు పారేసు కున్నారు. ఆ తరువాత కేవలం మరో 30 పరుగులు మాత్రమే జోడించి ఎస్ ఆర్ హెచ్ జట్టు మొత్తం 15 ఓవర్ల లోపే అలౌట్ అయింది. సన్ రైజర్స్ జట్టులో కెప్టన్ ప్యాట్ కమిన్స్ 19 పరుగులు స్కోరు చేయడమే అత్యధికం కావడం విశేషం. సన్ రైజర్స్ ను సిరాజ్ తొలి వికెట్ తీసి దెబ్బ కొట్టగా రబడా, హోల్డర్ లు చెరో 3 వికెట్లు తీసుకున్న గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.











Leave a Reply