(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో తమ అభిమానులను తీవ్రంగా నిరాష పరిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 229 పరుగులను చేసింది. ఆర్ ఆర్ కు 230 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో కేవలం 152 పరుగులు చేసి అలౌట్ అయింది.రషీద్ ఖాన్ 4, హోల్డర్ మూడు వికెట్లు తీసుకుని ఆర్ ఆర్ పతనాన్ని శాసించారు.
గుజరాత్ బ్యాటింగ్ లో ఓపెనింగ్ జంట మంచి శుభారంభాన్ని అందించింది. పాంలో ఉన్న శుభమన్ గిల్, సాయి సుదర్శన్ వంద పరుగు లకు పైగా భాగస్వామ్యం అందించారు 11వ ఓవర్ నాటికి 118 పరుగుల వద్ద సాయి సుదర్శన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. సుదర్శన్ 36 బాల్స్ ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్ లతో 55 పరుగులు చేసారు. 14 ఓవర్లోనే జోస్ బట్లర్ 14 ఓవర్లలో 150 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రీజులో నిలదొక్కుకున్న గిల్ 17వ ఓవర్లో 185 పరుగుల వద్ద 84 పరుగులు చేశారు. 44 బాల్స్ ఎదుర్కొని 9 ఫోర్లు, 3 సిక్స్ లను కొట్టారు. 19 వ ఓవర్లో హోల్డర్ 7 పరుగుల చేసి వెను దిరిగారు. వాషింగ్టన్ సుందర్ 20 బాల్స్ ఎదుర్కొని 37 పరుగులు, రాహూల్ తేవాటియా 4 బాల్స్ లో 14 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.


ఆ తరువాత 230 పరుగుల లక్ష్యంగా బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ కు మంచి ఆరంభమే లభించింది. కానీ… ఆ తరువాత వరుసగా ఆర్ ఆర్ బ్యాటర్లు వెనుదిరగడంతో గుజరాత్ టైటన్స్ బౌలర్లు మరింత రెచ్చి పోయారు. 3 ఓవర్లలో ఆర్ ఆర్ 38 పరుగులు సాధించి ఓపెనర్ సూర్యవంశీ వికెట్ కోల్పోయింది. వైభవ్ 16 బాల్స్ ఎదుర్కొని 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 36 పరుగులు చేసి ఔటయ్యారు. ఆతరువాత కొద్ది సేపటికే యశస్వీ జైస్వాల్ కూడా ఔట్ కావడంతో ఆర్ ఆర్ కు కష్టాలు మొదలయ్యాయి. కీలక బ్యాట్స్ మెన్లు క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలం అయ్యారు. రషీద్ ఖాన్ వరుసగా వికెట్లు తీస్తూ ఆర్సీబీ బ్యాటర్లను డిఫెన్స్ లో వేశారు. వరుస ఓవర్లలో4 వికెట్లు తీసుకున్నారు. ధృవ్ జురేల్, రవీంద్ర జడేజా, ఫెరీరా, శుభం దుబెలను వెంట వెంటనే ఔట్ చేయడంతో ఆర్ ఆర్ కోలుకోలేకపోయింది. 15 ఓవర్లలోనే 141 పరుగులు చేసి 8 వికెట్లన కోల్పోయింది. రవీంద్ర జడేజా క్రీజులో నిలదొక్కుకున్నట్లే కనిపించినా 25 బాల్స్ ఎదుర్కొని 38 పరుగులు చేశారు. ఇదే రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో అత్యధిక స్కోరు కావడం విశేషం.









Leave a Reply