
(హైదరాబాద్, న్యూస్ఇన్)
ఆస్ట్రేలియా బాండీ బీచ్ లో జరిగిన ఉగ్రదాడి కేసులో హైదరాబాద్ పోలీసులు నిందితుల గురించి పూర్తి స్థాయిలో ఆరా తీశారు. నగరంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన తండ్రి కొడుకులు కాల్పులకు తెగబడడంతో నగర పోలీసులు వారి గురించి స్థానికంగా విచారించారు. హైదరాబాద్ నుంచే తండ్రి, కొడుకులైన
సాజిద్, నవీద్అక్రమ్ పాస్పోర్టులను పొందారని గుర్తించారు. ఆరేళ్లుగా ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిద్ ప్రయత్నిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఆస్ట్రేలియా పౌరసత్వం ఖరారు కాకపోవడంతో భారత పౌరసత్వాన్ని సాజీద్ కొనసాగించారని,పదేళ్లపాటు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించిన సాజీద్ అక్కడే గడుపుతున్నారని పోలీసులు గుర్తించారు. నవీద్ అక్రమ్ అస్ట్రేలియా పౌరసత్వం ఉందని పోలీసుల దృష్టికి వచ్చింది.





Leave a Reply