NewsInn

News in a Click

మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

(హైదరాబాద్,న్యూస్ఇన్)

ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EHS) అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సచివాలంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన పలు అంశాలపై స్పందించిన చీఫ్ సెక్రటరీ స్పష్టమైన హామీలు మరియు వివరణలు ఇచ్చారు.సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్య నిర్ణయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగులందరికీ నాణ్యమైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా సహకరించాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కోరారు.

ప్రభుత్వ నిర్ణయాలు….

స్వయంప్రతిపత్తి సంస్థగా హెల్త్ ట్రస్ట్:ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధిని పర్యవేక్షించే ‘ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ (Employees Health Care Trust) ఒక స్వయంప్రతిపత్తి (Autonomous) సంస్థగా పనిచేస్తుంది.
ప్రభుత్వ సమాన వాటా జమ:
ఉద్యోగులు అందించే 1.5% కాంట్రిబ్యూషన్‌కు సమానంగా (Equal Contribution) ప్రభుత్వ వాటాను కూడా అదే రోజున (Same Day) ట్రస్ట్ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది.
EHS కమిటీ ఏర్పాటు:
ఈ పథకం పర్యవేక్షణ కోసం రాబోయే 2 నుండి 3 రోజుల్లోప్రత్యేక ఈహెచ్ఎస్ (EHS) కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

మార్గదర్శకాల ఖరారు:పథకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు మరియు విధివిధానాలను (Modalities) రాబోయే 7 రోజుల్లోతుది రూపం ఇస్తారు.

మెరుగైన వైద్యం – కాంట్రిబ్యూషన్:
ఉద్యోగులకు అంతర్జాతీయ స్థాయి (World Class) వైద్య సదుపాయాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పం. వైద్య సేవలు మరింత మెరుగ్గా ఉండాలంటే దానికి తగ్గట్టుగానే కాంట్రిబ్యూషన్ కూడా కొంత అదనంగా ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు.సకాలంలో అమలు కోసమే మినహాయింపు :
ప్రతి నెల 1వ తేదీన (జీతాల రోజే) ఉద్యోగుల వాటాను మినహాయించడం వెనుక మరే ఇతర ఉద్దేశం లేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఈ హెల్త్ స్కీమ్‌ను అత్యంత వేగంగా, సమర్థవంతంగా అమలు చేయాలన్నదే ప్రభుత్వ ఏకైక లక్ష్యం అని అన్నారు.

CS Review on New Employees Health Scheme

ఉద్యోగులు లేవనెత్తిన అంశాలు…

1). భార్య భర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయిన సందర్భంలో ఒక్కరి నుండే సబ్ స్క్రిప్షన్ మినహాయించాలి.
2). పోలీస్ శాఖలో , excise శాఖలో వేరు వేరు పేర్లతో ఇప్పటికే ఆరోగ్య పథకాలు అమలు అవుతున్నాయి . ప్రస్తుతం EHS లో కూడా మినహాయిస్తారా ?
3). Ayush ఆసుపత్రులలో కూడా వైద్యం పొందేందుకు అనుమతించాలి .
4). కుటుంబ సభ్యులను పరిగనించే సందర్భంలో సోదరి ,సోదరులను కూడా అనుమతించాలి .
5). భార్య భర్తలలో ఒకరు ఉద్యోగి మరొకరు పెన్షనర్ అయినప్పుడు ఎవరి నుండి ప్రీమియం తీసుకుంటారు.
6). సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవడానికి అనుమతించాలి.
7). అవివాహితులైన సంతానానికి 25 సంవత్సరాలు దాటినప్పటికీ వారిని కూడా పథకంలో ఉంచాలి
8). హెల్త్ ట్రస్ట్ లో సభ్యుల సంఖ్యను పెంచుతారా
9). ఇతర రాష్ట్రాల ఆసుపత్రులలో చికిత్సకు అనుమతిస్తారా ?
10). సర్వీస్ పెన్షనర్ , ఫామిలీ పెన్షనర్ లు ఒక్కరే ఉన్న సందర్భాల్లో ప్రీమియం ఎలా మినహాయిస్తారు .
11). పథకాన్ని ఏప్రిల్ మాసం నుండి అమలు చేస్తారా ?
12). ప్రీమియం మినహాయించి సందర్భంలో పే బిల్స్ లో ఉద్యోగుల మరియు ప్రభుత్వ వాటా కాలం ఉండాలి .
13). ప్రతి నెల మినహాయించబడ్డ ప్రీమియం వెంటనే ట్రస్ట్ బ్యాంకు ఖాతాలో జమ కావాలి .
14). చికిత్సకు అయ్యే విషయంలో అప్పర్ లిమిట్ ఉందా ? ప్యాకేజీ ల వివరాలు ఏమిటి ?
15). CPS ఉద్యోగుల విషయంలో రిటైర్ అయిన సందర్భంలో ప్రీమియం మినహాయించడానికి లాస్ట్ బేసిక్ పే మీద ఎలా లెక్కిస్తారు
16). అత్యవసర సమయంలో ఏ హాస్పిటల్ లో నైనా చేరేందుకు అనుమతించాలి
17). కంటింజెన్సీ ఉద్యోగుల విషయంలో EHS ఎలా అమలు చేస్తారు .
18). ప్రభుత్వ ఉత్తర్వులు నె . 174,171,91,186,97,98 లను పునర్నిర్వచించాలి
19).EHS పథకంలో మే మాస వేతనంలో భార్య భర్తల ఇద్దరి జీతాల నుండి ప్రీమియం మినహాయించినందున వాటిని తిరిగి రెమిట్ చేస్తారా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *