NewsInn

News in a Click

లోక్ భవన్లో భావోద్వేగ సన్నివేశం

లోక్ భవన్లో భావోద్వేగ సన్నివేశం

(హైదరాబాద్, న్యూస్ఇన్)

లోక్ భవన్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరుగుతున్న వేళ, అక్కడ చోటుచేసుకున్న ఓ హృద్యమైన ఘటన అందరినీ ఆకట్టుకుంది.
ఓ దివ్యాంగురాలి అభిమానానికి, ఆత్మవిశ్వాసానికి, ప్రతిభకు ప్రతీకగా నిలిచిన క్షణం.
జీహెచ్‌ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వైష్ణవి చిన్ననాటి నుంచే జీవిత సవాళ్లతో పోరాడుతోంది. అయితే శారీరక వైకల్యాన్ని ఆమె ఎన్నడూ తన కలలకు అడ్డంకిగా భావించలేదు. తన కాళ్లనే చేతులుగా మార్చుకుని చిత్రకళలో అసాధారణ నైపుణ్యాన్ని సాధించి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాపై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా వ్యక్తం చేయాలని వైష్ణవి నిర్ణయించుకుంది.

Governor honoring Vaishnavi

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ చిత్రపటాన్ని తన కాలి వేళ్లతో అద్భుతంగా చిత్రించింది. ఆ చిత్రాన్ని స్వయంగా గవర్నర్‌కు అందించాలన్న ఆమె కోరిక అవతరణ వేడుకల సందర్భంగా నెరవేరింది.గవర్నర్‌ను కలిసి తన కాలి వేళ్లతో గీసి అందజేసిన వైష్ణవిని చిత్రాన్ని పరిశీలించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు భావోద్వేగానికి లోనయ్యారు.

ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను అధిగమించి కళారంగంలో తనదైన ముద్ర వేస్తున్న వైష్ణవి సంకల్పాన్ని కొనియాడారు.ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి శ్రీమతి జానకి శుక్లా వైష్ణవిని ప్రత్యేకంగా సన్మానించి మెమెంటో, నగదు ప్రోత్సాహం అందజేశారు. ఆమెకు ఆశీస్సులు అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *