NewsInn

News in a Click

నగరంలో భారీ వర్షం-కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి

నగరంలో భారీ వర్షం-కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి

(హైదరాబాద్,న్యూస్ఇన్)

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం కనిపించింది. భారీ వర్షం ఈదురుగాలులతో నగర ప్రజలు చల్లబడ్డారు. భారీ వర్షానికి పాతబస్తీలోని చాంద్రాయణ గుట్ట ప్రాంతంలో కరెంటు వైర్లు తెగి రోడ్డుపైన పడ్డాయి. ఇది గమనించకుండా ఆటోలో నుంచి దిగిన ఇద్దరు యువకులు కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను చాంద్రాయణ గుట్టకు చెందిన జాఫర్ , అబూ లుగా గుర్తించారు. అరగంటకు పైగా కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. సెక్రటేరియట్ నాంపల్లి అబిడ్స్ కోటి సికింద్రాబాద్ హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 8 గంటల వరకు కూడా ట్రాఫిక్ ప్రభావం పూర్తిగా తగ్గలేదు. సరిగా కార్యాలయాలు ముగిసిన సమయంలోనే వర్షం రావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.

Minister Ponnam Prabhakar

పొన్నం సమీక్ష….

నగరంలో భారీ వర్షం కురియడంతో ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షం కారణంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులపై నీటి నిల్వ కాకుండా చూడాలని సూచించారు. జిహెచ్ఎంసి, హైడ్రా,ట్రాన్స్కో, పోలీసు శాఖల సమన్వయంతో ప్రజలకు సమస్యలు ఎదురుకాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా విద్యుత్ అధికారులు విద్యుత్ వైర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ట్రాఫిక్ సమస్యపై పోలీసులు దృష్టి సారించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *