NewsInn

News in a Click

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ఎల్పీ టెన్ష‌న్‌

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ఎల్పీ టెన్ష‌న్‌

వ‌స్తామ‌ని కొంత‌మంది ఎమ్మెల్యేల లీకులు

వస్తారా….రారా స‌స్పెన్స్ ?

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బీఆర్ఎస్ పార్టీ నుంచి విజ‌యం సాధించిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు కొత్త హ‌ర్డిల్స్ ఎదుర్కోబోతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌న్న పిటీష‌న్ ను స్పీక‌ర్ కొట్టి వేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం….ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్షేత్ర స్థాయిలో కొత్త‌చిక్క‌లు తెచ్చి పెడుతోంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఒక ఎత్త‌యింతే పార్టీ అధినేత కేసిఆర్ బీఆర్ ఎస్ ఎల్పీ స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌డం మ‌రో ఎత్తుగా చెప్పుకోవ‌చ్చు. మూడు రోజుల క్రితం ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటీష‌న్ ను స్పీక‌ర్ డిస్మిస్ చేశారు. మొత్తం 10 ఎమ్మెల్యేలు పార్టీ మార‌గా….ఐదుగురు ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు.మ‌రో ఐదుగురు ఎమ్మెల్యేల‌కు సంబంధించి తుది నిర్ణ‌యం వెల్ల‌డించాల్సి ఉంది.

అయితే బీఆర్ ఎస్ ఎల్పీ స‌మావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు వ‌స్తామ‌ని లీకులు ఇవ్వ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణా భ‌వ‌న్లో తెలంగాణా భ‌వ‌న్ లో ఆదివారం జ‌రిగే స‌మావేశానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు హాజ‌రు కావ‌డం సాధ్య‌మా అన్న‌చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో మొద‌లైంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సాంకేతికంగా బీఆర్ ఎస్ పార్టీలో నే ఉన్నామ‌ని చెబుతున్నా…… పార్టీ మారిన త‌రువాత ఆ నేత‌లు బీఆర్ ఎస్ పార్టీని విభేదిస్తూనే ఉన్నారు. ఆదివారం పార్టీ అధినేత నిర్వ‌హించే స‌మావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యేందుకు నిజంగానే వ‌స్తారా లేదా అన్న‌ది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. నిజ‌యంగానే పార్టీ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు వ‌స్తే….. ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌న్న‌ది ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌ను ఎట్టి ప‌రిస్తితుల్లోనూ మ‌ళ్లీ పార్టీలోకి తీసుకునే అవ‌కాశం లేద‌ని గులాబీ పార్టీ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.

ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో దానం నాగేంద‌ర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. క‌డియం శ్రీహ‌రి త‌న కూతురు క‌డియం కావ్య‌కు మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిచ‌డంతో ఆమె నామినేష‌న్ సంద‌ర్భంగా ప్ర‌తిపాద‌న‌ల్లో సంత‌కాలు చేశారు. ఇలాంటి ఆధారాలు చూపెట్టినా….. స్పీక‌ర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని బీఆర్ ఎస్ పార్టీ త‌ప్పుబ‌డుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై సుప్రీం కోర్టును ఇప్ప‌టికే ఆశ్ర‌యించ‌డంతో స్పీక‌ర్ నిర్ణ‌యంపై మ‌రోసారి పూర్తి ఆధారాల‌తో కేసు వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. రేప‌టి స‌మావేశానికి హాజ‌రయ్యేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వ‌స్తే ఒక‌లా…స‌మావేశానికి హాజ‌రు కాక‌పోతే గులాబీ పార్టీకి మ‌రోలా రాజ‌కీయంగా క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *