(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఎస్ ఆర్ హెచ్ – సీ ఎస్ కే మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ ధాటిగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఆ తరువాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో 20 చెన్నైకి 195 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే SRH బ్యాటర్లు చెన్నై బౌలర్లపై విరుచుకు పడ్డారు. ట్రావిస్ హెడ్ ఆచి తూచి ఆడుతుండగా….అభిషేక్ విధ్వంసం సృష్టించారు.

కేవలం 15 బంతులు మాత్రమే ఎదుర్కొని 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. మరో వైపు హెడ్ అవకాశం వచ్చినప్పుడు అడపా దడపా స్కోరును పరుగులు పెట్టించారు. 6 ఓవర్లలో 75 పరుగులు చేసి హెడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.20 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తో 23 పరుగులు చేశారు. ఫాంలో ఉన్న ఇషాన్ కిషన్ బ్యాటింగ్ వచ్చి తొలి బంతికే వెనుదిరగడంతో చెన్నై ఊపిరి పీల్చుకుంది. క్లాసెన్, అభిషేక్ లు స్కోరును పరుగులు పెట్టించారు. 7.6 ఓవర్లలో 93 పరుగుల స్కోరు వద్ద అభిషేక్ 22 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్ లతో 59 పరుగులు చేసి ఔటయ్యారు. అనికేత్ 2 పరుగులు , నితీష్ 12 పరుగులు మాత్రమే చేసి వెంటనే పెవీలియన్ చేరుకున్నారు.

14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 147 పరుగులుచేసింది. క్లాసెన్ 59 పరుగులు చేసి అన్షుల్ కంబోజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యారు. సలీల్ అరోరా 13 పరుగులు చేసి వెనుదిరిగారు. ఇన్నింగ్స్ ధాఠిగా మొదలు పెట్టినా…… తరువాతి క్రమంలో వరుసగా చెన్నై వికెట్లు కోల్పోయింది. జిమీ ఓవర్టన్ 3 వికెట్లు, ముఖేష్ 2 వికెట్లు తీసుకున్నారు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.











Leave a Reply