(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ లో చెన్నై అన్ని విభాగాల్లో రాణించింది. ముందుగా డీసీ బ్యాటింగ్ చేయడంతో తక్కువ పరుగలకే డీసీ ని కట్టడి చేయడంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విజయవంతం అయ్యారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై ఆరంభంలో ఆచి తూచి ఆడింది. 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది.4 వ ఓవర్లో తొలి వికెట్ ను రుతురాజ్ గైక్వాడ్ రూపంలో 24 పరుగుల వద్ద తొలి కోల్పోయింది. సంజు శాంసన్ ఆచి తూచి ఆడుతూ ఇన్నింగ్స్ చక్క దిద్దే ప్రయత్నంలో విజయవంతం అయ్యారు. సంజుకు జత కట్టిన ఊర్విల్ పటేల్ 45 పరుగుల వద్ద 9 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యారు. ఊర్విల్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కార్తిక్ శర్మ సహకారంతో సంజు క్రమంగా స్పీడు పెంచారు.
సంజు శాంసన్ స్పెషల్ ఇన్నింగ్స్…..
ఫోర్లు, సిక్స్ లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకు పడ్డారు. వీరిద్దరి భాగస్వామ్యం 15 ఓవర్ల వరకు 126 పరుగులకు చేరుకుంది.మరో వికెట్ నష్టపోకుండా సంజు శాంసన్ కార్తిక్ శర్మలు చెన్నైని గెలిపించారు. ఈ మ్యాచ్ లో సంజు మారో సారి రెచ్చి పోయారు. 52 బాల్స్ ఎదుర్కొని 6 సిక్స్ లు 7ఫోర్లతో సంజు 87 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. కార్మిక శర్మ 31 బాల్స్ ఆడి 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పెద్దగా స్కోరు చేయడంలో విజయవంతం కాలేకపోయింది. ఆజట్టు బ్యాటర్లు వరుసగా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో కేవలం 155 పరుగులకే పరిమితం అయింది. ఫాంలో ఉన్న కేఎల్ రాహూల్ ఈ మ్యాచ్ లో 12 పరుగులు మాత్రమే చేశారు. పాతుం నిశాంక కూడా 19 పరుగులు మాత్రమే చేసి త్వర త్వరగా వెనుదిరిగారు.పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చెన్నై చేయగలిగింది. నితీష్ రాణా, కరుణ్ నాయర్ లు కూడా 15, 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. దీంతో 11 ఓవర్లలో 69 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లను కోల్పోయింది.. జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆశించిన పరుగులు కూడా ఆ జట్టు బ్యాటర్లు చేయలేకపోయారు. 6వ వికెట్ భాగస్వామ్యంలో చెన్నై బ్యాటర్లు పరుగులు చేయగలిగారు.11వ ఓవర్ నుంచి 19వ ఓవర్ వరకు వికెట్ కోల్పోకుండా 134 పరుగులకు చెన్నై జట్టు స్కోరు చేరుకుంది. స్టబ్స్, సమీర్ రిజ్విలు నిలదొక్కుకోవడంతో మంచి స్కోరు ను చెన్నై అందుకోగలిగింది. 31 బంతుల్లో 38 పరుగులు చేసి స్టబ్స్ 6వ వికెట్ రూపంలో వెనుదిరిగారు. రిజ్వీ- అసుతోష్ శర్మలు మరో వికెట్ 149 పరుగుల వికెట్ కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఢీల్లీ క్యాపిటల్స్ 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయగలిగింది. చెన్నై జట్టులో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసుకోగా మిగిలిన బౌలర్లు తలో వికెట్ పడగొట్టారు.










Leave a Reply