NewsInn

News in a Click

DC కి షాక్ ఇచ్చిన PBKS- IPL లో అత్య‌ధిక ఛేజ్

DC కి షాక్ ఇచ్చిన PBKS- IPL లో అత్య‌ధిక ఛేజ్

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించామ‌న్న తృప్తి మూడు గంట‌లు కూడా మిగ‌ల లేదు. పంజాబ్ కింగ్స్ జ‌ట్టు రికార్డు స్థాయిలో చేజ్ చేసి ఐపీఎల్ లో కొత్త చ‌రిత్ర సృష్టించింది. 265 ప‌రుగుల భారీ ల‌క్ష్యంగా బ‌రిలో దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్లు ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఆడుకున్నారు. ఈ భారీ స్కోరు మ‌రో ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే ఛేదించారు. పంజాబ్ జ‌ట్టుకు ఓపెనర్లు అధ్బుత మైన శుభారంభాన్ని అందించారు. కేవ‌లం 7 ఓవ‌ర్ల‌లో 126 ప‌రుగుల‌కు జ‌ట్టు స్కోరు తీసుకెళ్లారు. ప్రియాన్ష్ ఆర్య‌, ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ లు ఢిల్లీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు.

ప్రియాన్ష్ 17 బంతుల్లోనే 43 ప‌రుగులు చేయ‌గా, సిమ్రాన్ 26 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 5 సిక్స్ ల‌తో 76ప‌రుగులు చేశారు. 126 ప‌రుగుల వ‌ద్ద పంజాబ్ ప్రియ‌న్ష్ వికెట్ కోల్పోయింది. 132 ప‌రుగుల వ‌ద్ద ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ ఔట‌య్య‌రు. రెండు వికెట్లు త్వ‌ర‌త్వ‌ర‌గా కోల్పోయినా పంజాబ్ 3వ వికెట్ ను కాన్లీ రూపంలో కేవ‌లం 17 ప‌రుగులు చేసి వెం145 ప‌రుగుల స్కోరు వ‌ద్ద ఔట‌య్యారు. అప్పుడు రంగంలోకి దిగిన కెప్ట‌న్ శ్రేయ‌స్ అయ్యార్ మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చారు. కెప్ట‌న్ ఇన్నింగ్స్ ఆడుతూ భారీ స్కోరును సులువుగా ఛేదించేలా బ్యాటింగ్ చేశారు. కేవ‌లం 36 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు,7 సిక్స్ ల‌తో 71 ప‌రుగులు సాధించి నాటౌట్ గా నిలిచారు. నేహ‌ల్ వ‌ధేరా తో క‌లిసి జ‌ట్టు స్కోరును భారీగా పెంచారు. చివ‌ర్లో శ‌శాంక్ సింగ్ శ్రేయ‌స్ కు తోడ‌య్యారు. 10 బాల్స్ ఎదుర్కొని 19 ప‌రుగులు చేసి శ్రేయ‌స్ తో క‌లిసి మ్యాచ్ ను మ‌రో ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే ముగించారు.

అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ భారీ స్కోరు న‌మోదు చేసింది. ఓపెన‌ర్ పాతుం నిసాంక వికెట్ త్వ‌ర‌గానే కోల్పోయినా రాహూల్ అధ్బుతంగా బ్యాటింగ్ చేశారు. కేవ‌లం 67 బాల్స్ ఎదుర్కొని 152 ప‌రుగులు చేశారు. 16 ఫోర్లు 9 సిక్స్ ల‌తో పంజాబ్ బౌల‌ర్ల‌ను ఆటాడుకున్నారు. రాహూల్ కు నితీష్ రాణా తోడు కోవ‌డంతో ఢిల్లీ జ‌ట్టు వేగంగా ప‌రుగులు చేసింది. నితీష్ 44 బాల్స్ ఎదుర్కొని 91 ప‌రుగులు చేశారు. ఇందులో 11 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. 28 ప‌రుగుల వ‌ద్ద తొలికెట్ కోల్పోయిన ఢిల్లీ, రెండో వికెట్ భాగ‌స్వామ్యానికి రికార్డు ప‌రుగులు జోడించింది. రాహూల్- నితీష్ లు 224 ప‌రుగుల‌ను రెండో వికెట్ భాగ‌స్వామ్యం న‌మోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *