(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఐపీఎల్ ప్రారుంభమైన నాటి నుంచి అద్భతమైన ఫాంలో కనిపించిన ఆర్ సీబీ గుజారాత్ టైటన్స్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసి తడబడింది. పరుగులు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంది. వరుసగా వికెట్లు కోల్పోవడం భారీ స్కోరున చేయలేకపోయింది. 19.2 ఓవర్లలో 155 పరుగులకు అలౌట్ కావడంతో గుజరాజ్ కు 156 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
ఆర్సీబీ జట్టులో దేవదత్ పడిక్కల్ మాత్రమే 40 పరుగులు చేశారు. ఇదే ఆ జట్టులో అత్యధిక స్కోరు. ఆరంభంలో 3 ఓవర్ల వరకు బ్యాటింగ్ కొనసాగినా ఆ తరువాత వరుసగా వికెట్లను గుజాత్ బౌలర్లు తీసుకోవడంతో కష్టాల్లో పడింది. జాకెబ్ బెథెల్, విరాట్ కోహ్లీలు ఎప్పుటి లాగానే 2.4 ఓవర్లలో జట్టు స్కోరును 34 పరుగలకు తీసుకెళ్లారు. అక్కడ బెథెల్ ఔట్ కావడంతో…. ఆర్సీబీ వికెట్ పతనం మొదలైంది. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. భారీగా పరుగులు రాబడుతున్నట్లు కనిపించిన విరాట్ కోహ్లీ కూడా కేవలం 13 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేశారు. ఆ తరువాత నాలుగు బంతులకే పెవినలియన్ చేరుకున్నారు. రజత్ పాటిదార్- దేవదత్ పడిక్కల్ మధ్య జట్టుకు మంచి భాగస్వామ్యం అందింది. వీరిద్దరు మరో వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేస్తూనే పరుగులు రాబట్టే యత్నాలు చేశారు. 7.04 ఓవర్ల వద్ద 79 పరుగుల వద్ద పాటిదార్ రూపంలో 3వ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన జితేష్ శర్మ, టీం డేవిడ్, కృనాల్ పాండ్యలు సింగిల్ డిజిట్ కే పరిమితం అయి పెవీలియన్ చేరుకున్నారు.

దీంతో 96 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయింది. క్రీజులో నిదొక్కుకున్న పడిక్కల్ – షెపర్డ్ లు కొద్ది సేపు స్కోరు బోర్డును పరుగెత్తించారు. పడిక్కల్ 24 బాల్స్ ఎదుర్కొని 5ఫోర్లు, 2 సిక్స్ లతో 40 పరుగులు చేసి ఔటయ్యారు. 15 బంతుల్లో 17 పరుగులు చేసి షెపర్డ్ కూడా ఆ వెంటనే వెనుదిరిగారు. దీంతో 15వ ఓవర్ వరకే కేవలం 126 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. వెంకటేశ్ అయ్యార్- భువనేశ్వర్ కుమార్ లు ఆచి తూచి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. 20 ఓవర్లు పూర్తయ్యే వరకు కొనసాగితే పరుగులు చేయవచ్చన్న లక్ష్యంగా ఆడారు. గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఆర్ సీబీ జట్టు అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. హోల్డర్, రషీద్ ఖాన్ రెండు ,అర్షద్ ఖాన్ మూడు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్, రబడాలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. వెంకటేశ్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ చివరి ఓవర్లలో పరుగులు సాధించడంతో ఆర్సీబీ గౌరవ ప్రదమైన స్కోరుకు చేరుకుంది. ఇంపాక్ట్ ఆటగాడిగా వచ్చిన అయ్యర్ 12 పరుగులు చేసి అధ్భుతమైన క్యాచ్ తో ఔటయ్యారు. భునేశ్వర్ కుమార్ 15 బంతులు చేశారు.19.2 ఓవర్లలో 155 పరుగుల వద్ద హెజిల్ ఉడ్ కావడంతో ఆర్సీబి 155 పరుగులకు అలాట్ అయింది. సమన్వయ లోపంతో రనౌట్ అయ్యారు.









Leave a Reply