(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
హౌంగ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఆర్ సీబీ గుజరాత్ టైటన్స్ పై విజయం దక్కించుకుంది. 206 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆర్సీబీ శుభారంభం దక్కలేదు. 3వ ఓవర్ లో జట్టు స్కోరు 26 పరుగులకు చేరుకున్న సమయంలోనే ఓపెనర్ బేథల్ వికెట్ కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభమైన ఓవర్లోనే సిరాజ్ బౌలింగ్ లో విరాట్ కొహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్ ను వాషింగ్టన్ సుందర్ జార విడిచారు. ఈ క్యాచ్ డ్రాప్ కావడంతోనే మ్యాచ్ కూడా మలుపు తిరిగినంత పనైంది. ఇక ఆ తరువాత గుజరాత్ బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. కానీ వచ్చిన బాటర్లు ఫోర్లు, సిక్స్ లతో 206 పరుగుల లక్ష్యాన్ని సులువగా ఛేదించారు.మరోక ఓవర్ మిగిలి ఉండగానే జీటీపై ఆర్సీబీ విజయం దక్కించుకుంది.

బేథెల్ ఔటైన తరువాత బరిలో దిగిన దేవదత్ పడిక్కల్- కొహ్లీలు కలిసి జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఫోర్లు, సిక్స్ లతో పడిక్కల్ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపారు. 27 బంతుల్లోనే 6 సిక్స్ లు 2 ఫోర్లతో 55 పరుగులు చేసి జట్టు స్కోరు141 పరుగుల వద్ద రెండో వికెట్ రూపంలో వెనుదిరిగారు. మరో వైపు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ భారీగా పరుగులు చేశారు. క్యాచ్ డ్రాప్ తరువాత ఛేజింగ్ లో తన ఆటతో కొహ్లీ చిన్న స్వామి స్టేడియంలో ప్రేక్షుకులను అలరించారు. 44 బాల్స్ ఎదుర్కొని 4 సిక్స్ లు,8 ఫోర్ల సహాయంతో 81 పరుగులు చేసి 154 పరుగుల స్కోరు వద్ద ఔటయ్యారు.
గుజరాత్ టైటన్స్ ఎలా ఆడిందంటే….
ఆ తరువాత జితేష్ శర్మ 10 పరుగులు చేసి వెనుదిరిగారు. ఈ సీజన్ లో ఫాంలో ఉన్న రజత్ పాటిదార్ ఈ మ్యాచ్ లో అతి తక్కువ పరుగుల చేసి వెనువెంటనే ఔటయ్యారు. దీంతో జీటీ కి గెలుపుపై ఆశలు పెరిగాయి. కృనాల్ పాండ్య, టీం డేవిడ్ లు గెలుపు తంతును పూర్తి చేశారు కృనాల్ కేవలం 12 బంతుల్లో 23 పరుగులు, డేవిడ్ 10 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.రషీద్ ఖాన్ రెండు, సిరాజ్, హోల్డర్, సూథర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.






Leave a Reply