(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
లక్నో సూపర్ జెంట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఈ సీజన్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. సగటున ప్రతి ఓవర్ 13 పరుగులు చేస్తేనే లక్నో జట్టు విజయం సాధించే విధంగా స్కోరు నమోదు చేసింది. 256 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన జట్టుకు మంచి ఆరంభమే అందింది. కానీ వత్తిడిని అధిగమించి భారీ స్కోరున లక్నో జట్టు చేయలేకపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేశారు. వరుసగా అన్ని మ్యాచ్ ల్లో గెలుస్తూ వచ్చి ఈ మ్యాచ్ లో కూడా అదే పరంపర కొనసాగించింది.
ఐపీఎల్ సీజన్ లోనే ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ తొలి వికెట్ ఆరంభంలోనే కోల్పోయింది. ఆ తరువాత భారీ స్కోరు చేయాలన్న లక్ష్యంగా పంజాబ్ బ్యాటర్లు వీర విహారం చేశారు. లక్నో బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా ఫోర్లు సిక్స్ లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు ఈ సీజన్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. పంజాబ్ బ్యాటర్లు ఆకాషమే హద్దుగా చెలరేగారు.పంజాబ్ ఇన్నింగ్స్ లో 21 సిక్స్ లు కొట్టడం విశేషం.

15 ఓవర్లలోనే దాదాపు 200 వరకు స్కోరును పంజాబ్ బ్యాటర్లు తీసుకెళ్లారు. ఈ మ్యాచ్ లో రికార్డు స్కోరు నమోదు ఖాయమన్న రీతిలో కింగ్స్ బ్యాటింగ్ కనిపించింది. ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ లు తొలి ఓవర్ లోనే సిమ్రాన్ పరుగులేమి చేయకుండా వెనుదిరగడంతో లక్నో పంజాబ్ జట్టును వత్తిడిలో కి నెట్టామని భావించింది. కానీ…ఆ తరువాత అసలు క్రికెట్ మజా మొదలైంది. ప్రియాన్ష్ ఆర్యకు – కూపర్ కాన్లీ తోడు గా రావడంతో మ్యాచ్ స్వరూపం ప్రతి ఓవర్ కు మారుతూ వచ్చింది.సిక్స్ లు ఫోర్లతో బంతులు బౌండరీని దాటించే లక్ష్యంగానే వీరి బ్యాటింగ్ సాగింది. ప్రియాన్ష్ ఆర్య ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను అలరించింది. రెండో వికెట్ భాగస్వామ్యం వీరిద్దరి మధ్య 13 ఓవర్లు పూర్తయ్యే సరికి 183 పరుగులకు చేరింది. 13వ ఓవర్ చివరి బంతికి కూపర్ కాన్లీ 46 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 7 సిక్స్ లతో 87 పరుగులు సాధించి ఔటయ్యారు. మరో వైపు క్రీజులో ఉన్న ప్రియాన్ష్ తన బ్యాట్ తో మెరుపులు మెరిపించారు. 37 బంతులు ఎదుర్కొన్న ఆర్య 9 సిక్స్ లు 4 ఫోర్ల సహాకారంతో 93 పరుగులు చేసి సెంచరీకి 7 పరుగుల దూరంలో 15వ ఓవర్లో వెనుదిరిగారు.

దీంతో లక్నో జట్టు కు కాస్త ఊపిరి పీల్చకున్నట్లయింది. వీరి ద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు లక్నో చేసిన ప్రయత్నాలు అంత సులువగా విజయవంతం కాలేదు. 20 ఓవర్లలో భారీ స్కోరు సాధించాలన్న లక్ష్యంగా పంజాబ్ బ్యాటర్లు స్కోరులో వేగం పెంచే లక్ష్యంగా బ్యాటింగ్ చేసి ఆ తరువాత వరుసగా వికెట్లు కోల్పోయారు.
కెప్టన్ శ్రేయస్ అయ్యర్ 5, నెహల్ వధేరా 13 పరుగులు చేసి వెంట వెంటనే ఔటయ్యారు. స్టోయినిస్, శశాంక్ సింగ్ లు లక్నో బౌలర్లపై విరుచుకు పడ్డారు.లక్నో బౌలర్లలో ప్రిన్స్ మినహా మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.లక్నో 256 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన లక్నో జట్టు 6 ఓవర్లలో 61 పరుగులను లక్నో జట్టు చేసి తొలి వికెట్ ను బదోని రూపంలో కోల్పోయింది.21 బంతుల్లో 31 పరుగులు చేసి బదోని ఔటయ్యారు. మిచెల్ మార్ష్ కూడా 28 బంతుల్లో 40 పరుగులు చేసి ఔటయ్యారు. 12 ఓవర్లలో 109 పరుగుల వద్ద రెండో వికెట్ లక్నో కోల్పోయింది. ఆ తరువాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో గెలుపు ఆశలు జట్టుకు సన్నగిల్లాయి. 13 ఓవ ఓవర్లో రిషబ్ పంత 23 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటయ్యారు. 139 పరుగుల వద్ద నికొలస్ పూరన్ వికెట్ ను కోల్పోయింది. 15వ ఓవర్లో 139 పరుగులు చేసి 4 వికెట్లు కో ల్పోయింది. మార్కరం, ముఖుల్ చౌదరీలు కూడా స్కోరు పెంచే క్రమంలో పలు మార్లు వారి క్యాచ్ లను పంజాబ్ ఫీల్డర్లు సులువైన క్యాచ్ లు కూడా డ్రాప్ చేవారు. మర్కరం 42 పరుగులు చేసి ఔటయ్యారు.










Leave a Reply