(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్లు నిప్పులు చెరిగారు. రాజస్థాన్ బ్యాట్స్ మెన్లను ఎక్కడా కుదురుకోకుండా బౌలింగ్ చేశారు. పవర్ ప్లేలోనే కీలక వికెట్లను రాజస్థాన్ కోల్పోయింది. ఆర్ ఆర్ బ్యాటర్లలో ఫాంలో ఉన్న ఓపెనింగ్ జోడీ కూడా ఈ మ్యాచ్ లో శుభారంభం ఇవ్వలేకపోయింది. ఎల్ ఎస్ జీ విజయలక్ష్యం 160 పరుగులుగా ఆర్ ఆర్ నిర్దేశించింది. వెటరన్ బౌలర్ షమీ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు యశస్వీ జైస్వాల్ ఆత్మరక్షణలో ఆడుతున్నట్లు కనిపించారు. బ్యాటింగ్ లో జోరు మీద కనిపించినా…. షమీ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. జైస్వాల్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ధృవ్ జురేల్ మొదటి బంతికే పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.

ఆ తరువాత లిటిల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ క్రీజులో ఉండడంతో ఆర్ ఆర్ ఇంకా భారీ స్కోరు చేస్తుందన్న ఆశలు ఇంకా కలిగించాయి. ఆ తరువాతి ఓవర్ లోనే వైభవ్ సూర్యవంశీ కూడా భారీ షాట్ ఆడబోయి ఔటయ్యారు. దీంతో 4 ఓవర్లలో 33 పరుగులు చేసి 3కీలక వికెట్లు ఒకే స్కోరు దగ్గర కోల్పోవడంతో రన్ రేట్ పెంచడం మిగిలిన బ్యాటర్లకు ఇబ్బంది కరంగా మారింది. ఒకే సారి మూడు వికెట్లు కోల్పోవడంతో ఆర్ ఆర్ కు బ్యాటింగ్ లో కోలుకోవడం ఇబ్బంది కరంగా మారింది.రియన్ పరాగ్, హెట్మియర్ లు కొద్ది సేపు లక్నో బౌలర్లను ఎదుర్కొన్న ఆధిపత్యం చూపలేకపోయారు. ఫాం లేక సతమతం అవుతున్న రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ లో అవకాశం ఉన్నా… మరోసారి తక్కువ స్కోరుకే ఔటయ్యారు.19 బంతుల్లో 20 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో62 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడుతున్నట్లు కనిపించిన హెట్మెయిర్ కూడా 22 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 77 పరుగులకు మాత్రమే ఆర్ ఆర్ పరిమితం అయింది. మరో వైపు రవీంద్ర జడేజా, ఫెరీరాల భాగస్వామ్యం జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది.110 పరుగుల వద్ద ఫెరీరా 20 పరుగులు చేసి ఔటయ్యారు.ఈ మ్యాచ్ లో వెటరన్ అల్ రౌండర్ జడేజా చేసిన పరుగులే అత్యధికం 29 బాల్స్ ఎదుర్కొని 43 పరుగులు చేశారు. శుభమ్ 11 బంతుల్లో 19 పరుగులు చేయడంతో చివర్లో జట్టు స్కోరు గౌరవ ప్రదంగా మారింది. 159 పరుగులకు చేరుకుంది.ఎల్ ఎస్ జీ బౌలర్లలో షమీ, ప్రిన్స్ యాదవ్, మోహిసిన్ ఖాన్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. చివరి నాలుగు ఓవర్లలో ఆర్ ఆర్ 49 పరుగులను రాబట్టింది. 20 ఓవర్లలో 159 పరుగులు చేసిన ఆర్ ఆర్ ఎస్ జీ విజయలక్ష్యం 160 పరుగులుగా ఆర్ ఆర్ నిర్దేశించింది.





Leave a Reply