NewsInn

News in a Click

సంజు సెంచ‌రీ- MI విజ‌య‌ల‌క్ష్యం 208

సంజు సెంచ‌రీ- MI విజ‌య‌ల‌క్ష్యం 208

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌)

చెన్నై సూప‌ర్ కింగ్స్, ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై ముంబాయికి 208 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ముంబాయి హోం గ్రౌండ్స్ లో జ‌రిగిన మ్యాచ్ లో సంజు మ‌రో సారి చెల‌రేగారు. ఐపీఎల్ రెండో సెంచ‌రీ సాధించారు. సంజు సెంచ‌రీతో చెన్పై 200 ప‌రుగుల మైలు రాయిని సులువుగానే చేరుకుంది. చెన్నై ఇన్నింగ్స్ ధాటిగానే మొద‌లు పెట్టింది. సంజు, రుతురాజ్ గైక్వాడ్ 3 ఓవ‌ర్ల‌లోనే 32 ప‌రుగుల ప‌రుగులు చేసి రుతురాజ్ గైక్వాడ్ 22 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. సంజు, సర్ఫ‌రాజ్ ఖాన్ లు ప‌వ‌ర్ ప్లేను పూర్తి స్థాయిలో స‌ద్వినియోగం చేసుకుని 5.4 ఓవ‌ర్ల‌లో 72 ప‌రుగులుకు జ‌ట్టు స్కోరును చేర్చారు. స‌ర్ఫ‌రాజ్ ఔటైన త‌రువాత శివం దుబే బ్యాటింగ్ కు వ‌చ్చినా పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేదు 91 ప‌రుగుల వ‌ద్ద 3వికెట్ రూపంలో శివం దూబె కూడా వెనుదిరిగారు. బ్రేవిస్ 21 ప‌రుగులు చేయ‌డంతో జ‌ట్టు మ‌రోసారి కుదుట‌ప‌డింది. 11 ఓవ‌ర్లో 124 ప‌రుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది.

సంజు కు తోడుగా అప్పుడు కార్తిక్ శ‌ర్మ బ్యాటింగ్ కువ‌చ్చి సంజు కు పూర్తి స్థాయిలో స‌హ‌కారం అందించ‌డంతో సంజు రెచ్చి పోయారు. కార్తిక్ 18 ప‌రుగులు చేసి వెనుదిరిగారు. ఆ త‌రువాత ఓవ‌ర్ట‌న్ తో క‌లిసి జ‌ట్టు స్కోరును సంజు 200 ప‌రుగులు దాటించ‌డంతో శాంస‌న్ కూడా మ‌రోసారి సెంచ‌రీ చేశారు. 18 వ ఓవ‌ర్లో ఓవ‌ర్ట‌న్ కూడా వెనుదిరిగారు. ఆ త‌రువాత అఖిల్ హోసేన్ సంజు తోడ‌య్యారు. చివ‌రి బంతికి సంజు ఫోర్ కొట్టి 101 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు. శాంస‌న్ 54 బాల్స్ ఎదుర్కొని 10 ఫోర్లు, 6 సిక్స్ ల‌తో 101 ప‌రుగుల చేశారు. సంజు ఓంట‌రి పోరాటంగో చెన్నై జ‌ట్టు 200 ప‌రుగుల‌కు పైగా స్కోరు చేయ‌గ‌లిగింది. ముంబాయి బౌల‌ర్ల‌లో అశ్విన్ కుమార్, గ‌జ‌న్ ఫ‌ర్ రెండు వికెట్లు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *