(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
నామమాత్రపు లక్ష్య ఛేధనతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ప్రారంభంలోనే సంజు శాంసన్ వికెట్ కోల్పోయినా….. ఆ తరువాత ఎక్కడా ముంబాయి ఇండియన్స్ కు అవకాశం ఇవ్వకుండా చెన్నై జట్టు ఏకపక్షంగా మ్యాచ్ ను పూర్తి చేసింది. ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ బ్యాటర్లు విఫలం కావడంతో చెన్నై కి సునాయస విజయం దక్కింది. సీఎస్ కే జట్టు ముంబాయి ఇండియన్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది. ముంబాయితో జరిగిన రెండు మ్యాచ్ లో కూడా సీఎస్కే విజయం సాధించింది.160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సంజు శాంసన్ వికెట్ 2వ ఓవర్ చివరి బంతికి కోల్పోయింది. 7 పరుగులు చేసిన సంజు శాంసన్ కు బూమ్రా బౌలింగ్ లో లభించిన లైఫ్ ను శాంసన్ సద్వినియోగం చేసుకోలేదు. అదే ఓవర్ లో ఒక్క ఫోర్ కొట్టి చివరి బంతికి ఔటయ్యారు కెప్టన్ రుతురాజ్ గైక్వడ్ కు ఊర్విల్ పటేల్ జత కట్టారు.


కొద్ది సేపే క్రీజులో ఊర్విల్ ఉన్నా…12 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 24 పరుగులు చేసి వెనుదిరిగారు. ఆ తరువాత కెప్టన్ కు కార్తిక్ శర్మ జతకట్టారు. వీరిద్దరి భాగస్వామ్యం జట్టు విజయానికి బాటలు వేసింది. గైక్వాడ్ ఈ మ్యాచ్ లో ఫాంలోకి రావడంతో చెన్నై కి కలిసి వచ్చింది. 15 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఈ ఇద్దరు బ్యాటర్ల భాగస్వామ్యం ముంబాయి బౌలర్లు ఏ దశలోనూ చెన్నై బ్యాటర్లపై ప్రభావం చూపలేకపోయారు. ఈ ఇద్దరి భాగస్వామ్యంలో దాదాపు వంద పరుగులు వచ్చాయి కార్మిక్ శర్మ 40 బంతుల్లో ఐపీఎల్ సీజన్ లో తొలి హాప్ సెంచరీ నమోదు చేసుకున్నారు. మరో వైపు రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 67 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. కార్తిక్ 54 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.








Leave a Reply