(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
లక్నో సూపర్ జెంట్స్, ముంబాయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 10 ఓవర్ల వరకు ఎల్ ఎస్ జీ బ్యాటర్లు ముంబాయి ఇండియన్స్ బౌలర్లను వణికించారు. ఏ బౌలర్ బౌలింగ్ చేసినా ఫోర్లు, సిక్స్ లు బాదుతూ ముంబాయి బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి వికెట్ ఆరంభంలోనే కోల్పోయినా…. ఆ సంబరం ఎంతో సేపు ఎల్ ఎస్ జీ బ్యాటర్లు ముంబాయి ఇవ్వలేదు. మిచెల్ మార్ష్- జోష్ ఇంగ్లీష్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఇంగ్లీష్ 13 పరుగులు మాత్రమే చేసి 29 పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో వెనుదిరిగారు. మార్ష్ కు నికొలస్ పూరన్ తోడు కావడంతో జట్టు స్కోరు ఊహించని విధంగా పెరిగింది. 5 ఓవర్లలోనే 90 పరుగులకు స్కోరు చేరుకుంది. ఫాం లేమితో ఇబ్బందులు పడుతున్న పూరన్ ఈ మ్యాచ్ లో విశ్వరూపం చూపార. 21 బాల్స్ మాత్రమే ఎదుర్కొన్న పూరన్ 8 సిక్స్ లు, 1 ఫోర్ తో 63 పరుగులు చేసి ముంబాయి బౌలర్లకు తన ప్రతాపం చూపించారు.8.1 ఓవర్లలోనే జట్టు స్కోరు 123 పరుగులకు చేరుకుంది.

అక్కడ రెండో వికెట్ రూపంలో పూరన్ ఔట్ కావడంతో…. ముంబాయి బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. అదే ఓవర్లో మార్ష్ కూడా వెనుదిరగడంతో….. లక్నో బ్యాటర్లు కొంత మంది ఇలా వచ్చి అలా వెళ్లి పోయారు. రిషబ్ పంత్ 15 పరుగులు, రఘువంశీ 11 పరుగుల చేసి 160 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఎయిడెన్ మార్కరం, హిమ్మత్ సింగ్ లు మరో వికెట్ కోల్పోకుండా పరుగులు సాధించడంపై దృష్టి పెట్టారు.మార్క్ రం 24 బంతుల్లో 31 పరుగులు, హిమ్మత్ సింగ్ 30 బంతుల్లో 40పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
ముంబాయి బౌలర్లలో బౌష్ రెండు వికెట్లు ఇతర బౌలర్లు తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఆరంభంలో భారీ స్కోరు చేసినా మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు దిశగా వెళతున్నట్లు ఎల్ ఎస్ జీ కనిపించింది. కానీ 228 పరుగులకే పరిమితం అయింది.









Leave a Reply