(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
ముంబాయి ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో ముంబాయి జట్టును తిలక్ వర్మ ఆదుకున్నారు. తొలి ఓవర్లలోనే వికెట్లు పడడంతో డిఫెన్స్ పడింది.ముంబాయి పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన వర్మ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. సెంచరీ సాధించి నాటౌట్ గా నిలిచారు. ముంబాయి బ్యాటింగ్ జరిగిన విధానాన్ని పరిశీలిస్తే….. ఓపెనర్లు క్వింటన్ డికాక్ 13 పరుగులు, డానిష్ మాలేవర్ 2 పరుగులు చేసి 4 ఓవర్లలోపే 25 పరుగుల వద్ద ముంబాయి జట్టు రెండు వికెట్లు కోల్పోయింది.

ఫాం లేమితో సతమతం అవుతున్న సూర్యకుమార్ యాదవ్ కొద్ది సేపు క్రీజులో నిలదొక్కకుని ఈ మ్యాచ్ లో ఫాంలోకి వచ్చినట్లు కనిపించినా మరో 19 పరుగులు జోడించిన అనంతరం 44 పరుగుల వద్ద 15 పరుగులు చేసి వెనుదిరిగారు.ఈ మూడు వికెట్లు కూడా 3 వికెట్లు తీసుకోవడం విశేషం. అనంతరం బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ, నుమన్ ధీర్ తో కలిసి జట్టు స్కోరు పెంచారు. నిలకడగా ఆడుతూ సమయం వచ్చినప్పుడే భారీ షాట్లు ఆడుతూ ముంబాయి జట్టు భారీ స్కోరు కు బాటలు వేశారు. 96 పరుగుల వద్ద నుమన్ ధీన్ 45 పరుగులు చేసి ప్రసిద్ క్రిష్ణ బౌలింగ్ లో ఔటయ్యారు.

మరో వైపు క్రీజులో నిలదొక్కుకున్న తిలక్ వర్మ ఫోర్లు, సిక్స్ లతో జట్టు స్కోరు భారీగా పెంచేలా బ్యాటింగ్ చేశారు. తిలక్ కు హర్దిక్ తోడు కావడంతో చివరి ఓవర్లలో ముంబాయి జట్టు భారీగా పరుగులు రాబట్టింది. తిలక్ వర్మ 45 బంతుల్లో8 ఫోర్లు, 7సిక్స్ లతో 101 పరుగులు చేశారు. వర్మ సెంచరీతో ముంబాయి జట్టు 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది.









Leave a Reply