NewsInn

News in a Click

ORR ఘోర రోడ్డ ప్ర‌మాదం ఐదుగురు మృతి

ORR ఘోర రోడ్డ ప్ర‌మాదం ఐదుగురు మృతి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

శంషాబాద్ స‌మీపంలోని ఔట‌ర్ రింగ్ రోడ్ పై జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఐదుగురు కుటుంబ స‌భ్యులు స్పాట్ లోనే మృతి చెందారు. ఔట‌ర్ రోడ్డ‌పై నిలిచి లారీ కింద భాగంలోకి కారు దూసుకు వెళ్ల‌డంతో కారులో ఉన్న ఆరుగురు కుటుంబ స‌భ్యుల్లో ఐదుగురు అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించారు. మ‌రొక‌రు తీవ్రంగా గాయ ప‌డ‌డంతో పోలీసులు గాయ‌ప‌డ్డ మ‌హిళ‌ను ఆసుపత్రికి త‌ర‌లించారు.

మృత‌దేహాల‌ను పోస్టు మార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరంతా సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీఆర్ ఎస్ నేత కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు గుర్తించారు. దీంతో బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధిత కుటుంబస‌భ్యుల‌ను టెలిఫోన్లో ప‌రామ‌ర్శించారు.

ఘ‌ట‌నా స్థలాన్ని ప‌రిశీలిస్తే….కారు డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే లారీని ఓ ఆర్ ఆర్ పై ఆపాడం కూడా ప్ర‌మాదానికి ఓ కార‌ణంగా పోలీసులు భావిస్తున్నారు. కారు అతి వేగంగా వెళ్లి ఆగి ఉన్న లారీ కింద‌కు దూరి పోయింద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆగి ఉన్న లారీ కి సంబంధించి ఎలాంటి హెచ్చ‌రిక‌లు లారీకి స‌మీపంలో ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం కూడా ఓ కార‌ణంగా భావిస్తున్నారు. ప్ర‌మాదం స‌మాచారం తెలియ‌డంతో పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *