(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
సన్ రైజర్స్ హౌంగ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను సన్ రైజర్స్ చిత్తు చేసింది. పంజాబ్ పై విజయం తో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఫాంలో ఉన్న పంజాబ్ ఇటీవల వరుసగా ఓటములు ఎదుర్కోవాల్సి వస్తోంది.సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో పంజాబ్ జార విడిచిన క్యాచ్ లు ఈ మ్యాచ్ లో పంజాబ్ కు భారీ మూల్యం చెల్లించేలా చేశాయి. పంజాబ్ ఇన్నింగ్స్ లో కూపర్ కాన్లీ ఈ మ్యాచ్ లో సెంచరీ నమోదు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. 57 పరు 101 పరుగులు చేశారు. కాన్లీ ఒంటరి పోరు మాత్రమే పంజాబ్ బ్యాటింగ్ లో హైలెట్ గా నిలిచింది.ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ లు 10 పరుగుల స్కోరు వద్ద ఉన్న సమయంలోనే ఇద్దరి క్యాచ్ లు పంజాబ్ ఫీల్డర్లు జార విడిచారు. దీంతో వీరిద్దరు పంజాబ్ బౌలర్లపై విరుచుకు పడి పరుగులు సాధించారు. సన్ రైజర్స్ జట్టులో వీరిద్దరి చేసిన పరుగులు, భాగస్వామ్యమే ఎక్కువ. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 పరుగులు సాధించారు. హెన్రిచ్ క్లాసెన్ 43 బంతులు ఎదుర్కొని 69 పరుగులు చేశారు. నాలుగు వికెట్లు కోల్పోయి సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు సాధించింది.

236పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు త్వర త్వరగానే ఔటయ్యరు. 4 పరుగుల స్కోరు చెరుకునే లోపే ఓపెనర్ల వికెట్లను పంజాబ్ కోల్పోయింది. ఆ తరువాత పంజాబ్ జట్టు పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడింది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ లు ఫాంలో ఉన్నా ఈ మ్యాచ్ లో రెండు రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. కెప్టన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ వచ్చి కొద్ది సేపు వికెట్లు కోల్పోకుండా ఆపినా…23 పరుగుల వద్ద శ్రేయస్ కూడా కేవలం 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. కూపర్ కాన్లీ, స్లోయినిస్ బ్యాటింగ్ లో కొద్ది సేపు మెరుపులు మెరిపించారు.

63 పరుగుల వద్ద స్టోయినిస్ 14 బాల్స్ ఎదుర్కొని 28 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదో వికెట్ భాగస్వామ్యంలో కాన్లీ- సూర్యన్ష్ షిడ్గేలు జట్టు స్కోరు పెంచేలా భాగస్వామ్యం అందించారు. కానీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. వీరిద్దరి భాగస్వామ్యమే పంజాబ్ కింగ్స్ కు అత్యధికం. 12 ఓవర్ల వరకు 110 పరుగులు వద్ద షిడ్గే 25 పరుగులు చేసి ఔటయ్యారు. 14 ఓవర్లో 6వ వికెట్ రూపంలో శశాంక్ సింగ్ కూడా ఔటయ్యారు. దీంతో 15 ఓవర్లలో పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐదు ఓవర్లలో 100 కు పైగా పరుగులు చేయాల్సి రావడంతో పంజాబ్ కింగ్స్ ఢీలా పడింది. ప్యాట్ కమిన్స్ 2, శివాంగ్ రెండు వికెట్లు తీసుకోగా మిగలిప వారంతా ఒక్కో వికెట్ పడగొట్టారు. పంజాబ్ వికెట్లు క్రమంగా పడుతున్నా…కూపర్ కాన్లీ మాత్రం సన్ రైజర్స్ బౌలర్లపై ఆధిపత్యం చూపారు. పంజాబ్ జట్టులో కాన్లీ 58 బాల్స్ ఎదుర్కొని 107 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.20 ఓవర్లలో పంజాబ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది.












Leave a Reply