NewsInn

News in a Click

RCB చేతిలో DELHI CAPITALS చిత్తు

RCB చేతిలో DELHI CAPITALS చిత్తు

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్దేశించిన 76 ప‌రుగుల ల‌క్యాన్ని ఆర్సీబీ ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. గెలుపుపై ఏమాత్రం అనుమానం లేకున్నా…ఆర్సీబీ జ‌ట్టు కేవ‌లం ఒక వికెట్ కోల్పోయి ఢిల్లీని చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ- బేథెల్ లు ఇన్నింగ్స్ మొద‌లు పెట్టారు. బేథెల్ 11 బంతుల్లో 20 ప‌రుగులు చేసి 26 ప‌రుగుల వ‌ద్ద వెనుదిరిగారు.

ఆ త‌రువాత కొహ్లీ, ప‌డిక్క‌ల్ లు ఎక్క‌డా అవ‌కాశం ఇవ్వ‌కుండా 6.3 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించి విజ‌యం సాధించింది. బేథెల్ స్థానంలో వ‌చ్చిన ప‌డిక్క‌ల్ కేవ‌లం 13 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 3 సిక్స్ ల‌తో 34 ప‌రుగుల చేయ‌గా, విరాట్ కోహ్లీ 11 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు. 6.3 ఓవ‌ర్ల‌లో ఒక వికెట్ కోల్పోయి 77 ప‌రుగులు చేసింది. దీంతో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ విజ‌యం ద‌క్కించుకుంది.

RCB బౌల‌ర్ల ధాటికి ఢిల్లీ విల‌విల‌……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *