(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 76 పరుగుల లక్యాన్ని ఆర్సీబీ ఓవర్లలోనే ఛేదించింది. గెలుపుపై ఏమాత్రం అనుమానం లేకున్నా…ఆర్సీబీ జట్టు కేవలం ఒక వికెట్ కోల్పోయి ఢిల్లీని చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ- బేథెల్ లు ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. బేథెల్ 11 బంతుల్లో 20 పరుగులు చేసి 26 పరుగుల వద్ద వెనుదిరిగారు.

ఆ తరువాత కొహ్లీ, పడిక్కల్ లు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. బేథెల్ స్థానంలో వచ్చిన పడిక్కల్ కేవలం 13 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 34 పరుగుల చేయగా, విరాట్ కోహ్లీ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 6.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసింది. దీంతో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ విజయం దక్కించుకుంది.












Leave a Reply