(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
గత రెండు మూడు రోజులుగా ఐపీఎల్ మ్యాచ్ లు వన్ సైడ్ గా జాగుతున్నాయి. ఏకపక్ష విజయాలు నమోదవుతున్నాయి. తాజాగా జరిగిన RCB Vs LSG మ్యాచ్ లో కూడా ఆర్సీబీ సునాయస విజయం సాధించింది. 147 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన స్థానిక జట్టు ఆడుతూ పాడుతూ స్కోరు చేధించింది. వికెట్లు కోల్పోతున్నా….ఎక్కడా ఆత్మరక్షణలో పడినట్లు కనిపించలేదు. 200 పైగా పరుగులు సాధించినా…సులువుగా ఛేదిస్తున్న మ్యాచ్ లతో పోలిస్తే ఈ మ్యాచ్ ప్రేక్షకులను పెద్దగా ఉత్సాహ పరచకుండానే ముగిసింది. అయితే కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ అలరించింది. లక్నో బౌలర్లను ఎదుర్కుంటూ ఆర్సీబీ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. 15.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఐదు వికెట్త తేడాతో ఆర్సీబీ ఎల్ ఎస్ జీ పై విజయం నమోదు చేసింది.ఆర్సీబీ ఇన్నింగ్స్ ధాటిగా మొదలు పెట్టారు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీలు.1,4 ఓవర్ల వద్ద ఫిల్ సాల్ట్7 పరుగులు చేసి త్వరగానే ఔటయ్యారు. ఆ తరువాత కొహ్లీ మరోసారి ఛేజింగ్ లో తాను ఎంత అవసరమో అనేలా ఇన్నింగ్స్ లో భారీ షాట్లు ఆడుతూ పవర్ ప్లేలో భారీగా స్కోరు పెరిగేలా బ్యాటింగ్ చేశారు. దేవదత్ పడిక్కల్ తో కలిసి 7.2 ఓవర్లలోనే 66 పరుగులకు స్కోరును చేర్చారు.పడిక్కల్ కూడా 10 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. క్రీజులో ఉన్న కోహ్లీ తన బ్యాటింగ్ తో జట్టు కు విజయాన్ని ఖాయం చేసే లా ఇన్నింగ్స్ చక్క దిద్దారు. కింగ్ కోహ్లీకి తోడుగా పడిక్కల్ బ్యాటింగ్ లో తోడు కావడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.10 ఓవర్లలోనే 86 పరుగలకు స్కోరు చేరుకుంది. అప్పటికీ కోహ్లీ 34 బంతులు ఎదుర్కొని49 పరుగులతో ఆడుతున్నారు.

ఇందులో 6 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. భారీ షాట్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవాలని ప్రయత్నించిన కోహ్లీ 49 పరుగుల వద్ద ఔటయ్యారు. దీంతో ఎల్ ఎస్ జీ ఊపిరి పీల్చుకుంది. మరో వైపు కెప్టన్ పాటిదార్ భారీ షాట్లతో స్కోరును కొనసాగించారు. కేవలం 13 బాల్స్ ఎదుర్కొని 3 సిక్స్ లు ఒక ఫోర్ సహాయంతో 27 పరుగులు చేసి భారీ షాట్ ఆడబోయి 4వ వికెట్ రూపంలో వెనుదిరిగారు. జీతేష్ శర్మ, పాటిదార్ ల భాగస్వామ్యం జట్టును గెలుపు దగ్గరకి తీసుకెళ్లింది. జితేష్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 9 బంతులు ఎదుర్కొని 2 సిక్స్ లు, 2 ఫోర్ల సహాయంలో 23 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో వెనుదిరిగారు. దీంతో ఆర్సీబీ స్కోరు మందగిందించి టీం డేవిడ్, షెపర్డ్ లు ఆచి తూచి ఆడుతూ జట్టును గెలిపించే బాద్యతలు తీసుకున్నారు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ 20 ఓవర్లలో 146 పరుగుల సాధించింది ఆర్సీబి ముందు 147 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో తడబడింది. ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోవడం లక్నో బ్యాటర్లకు సవాల్ గా మారింది. క్రమంగా వికెట్లు క్పలోవడంతో పాటు ఆర్సీబీ ఫీల్డర్ల అద్భుతమైన ఫీల్డింగ్ తో బ్యాట్స్ మెన్లు వెంట వెంటనే పెవిలీయన్ చేరుకున్నారు.
ఇన్నింగ్స్ ఆరంభంలో పర్వాలేదని పించే విధంగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. లక్నో. 32 పరుగుల వద్ద తొలి వికెట్ ను నాలుగో ఓవర్లో మార్కరం12 పరుగులు ఔటయ్యారు. మరో ఓపెనరల్ మిఛిల్ మార్ష్ క్రీజుల్లో నిలదొక్కుకున్నట్లు కనిపించింది. మార్కరం స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన నికోలస్ పూరన్ 35 పరుగుల వద్ద ఔటయ్యరు.7 బంతులు ఎదుర్కొని ఒకే పరుగు చేసి ఔటయ్యరు. రిషబ్ పంథ్ వచ్చి రావడంతోనే భారీ హిట్టింగ్ చేసే ప్రయత్నంలో ఫిల్ సాల్ట్ అద్భుత క్యాచ్ తో వెంటనే వెనుదిరిగారు.మర్ష్ 3వ వికెట్ రూపంలో 71 పరుగల దగ్గర40 పరుగులు చేసి కృనాల్ పాండ్య బౌలింగ్ లో బౌల్డ్ అయ్యారు. అబ్దుల్ సమద్ పరుగులేమి 83 పరుగుల వద్ద చేయకుండానే వెనుదిరిగారు. ఆయుష్ బదోని 24 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేసి వెనుదిరిగారు. 16 ఓవ ఓవర్లో 118 పరుగుల వద్ద వెనుదిరిగారు.

ఆ తరువాత కూడా వరుసగా లక్నో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరును సాధించలేకపోయింది. లిండే, షమీలు 137 పరుగుల వద్దే 18 వ ఓవర్లో వెనువెంటనే ఔటయ్యారు. జట్టు స్కోరును పెంచుతూ వచ్చిన ముకుల్ చౌదరీ 145 పరుగల వద్ద 39 పరుగులు చేసి ఔటయ్యారు. ముకుల్ 28 బాల్స్ ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్స్ లతో సాధించారు. మొత్తం 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే ఎల్ ఎస్ జీ చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ 3,రసిక DAAR 3 వికెట్లు తీసుకోగా కృనాల్ పాండ్య 2, హేజిల్ ఉడ్ ఒక వికెట్ తీసుకున్నారు.చివరి ఓవర్లను మరింత కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో జట్టు బ్యాటర్లు పరుగులు సాధించడానికి ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వికెట్లు కూడా కోల్పోయారు.










Leave a Reply