(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాలో రాష్ట్ర సమితి రాష్ట్ర రాజకీయాల్లోకి మరోసారి ఎంట్రీ ఇచ్చింది. బీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ కూతురు కవిత టీఆర్ ఎస్ పార్టీ పేరుతో తన రాజకయ అదృష్టాన్ని పరీక్షంచుకోనుంది.దాదాపు10 నెలల క్రితం బీఆర్ ఎస్ ను సస్పెండో చేసిన అనంతరం కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణా ప్రజల వద్దకు వస్తామని ప్రకటించిన కవిత నేడు పార్టీని ఏర్పాటు చేసింది.
మేడ్చల్ సమపంలోని మునిరాబాద్ లోని అద్వయఫంక్షన్ హాల్ లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలను, కార్యకర్తలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భారీ వేదికను ఏర్పాటుచేసి తెలంగాణా ఉద్యమ కారుల పేర్లను ఆయా ప్రాంగాణాలకు పెట్టారు.ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంలో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు.

ఉదయం 10 గంటలకు ఫంక్షన్ హాల్ కు చేరుకున్న ఆమె..10,13 నిమిషాలకు పార్టీ పేరును ప్రకటించారు. తెలంగాణా రాష్ట్ర సమితి పేరుకు దాదాపు పోలి ఉండే పేరునే కవిత తన పార్టీ పేరుగా ఖరారు చేశారు. ఇంగ్లీష్ లో పలికితే టీఆర్ఎస్ అని మాత్రమే వస్తుంది.కాన కవిత పార్ట పేరు “తెలంగాణా రాష్ట్ర సేన “( T R S) గా పేరు ప్రకటించింది. పార్టీ ఏర్పాటు ఆవశ్యకతను గురించి ఆమె ఈ సభలో వివరించారు.
కవిత పార్టీ ఎందుకు పెట్టారు….
పార్టీ ఆవిర్బావ సభ సందర్బంగా హైదరాబాద్ నగరంతో పాటు ఆ ప్రాంతానిక వెళ్లే దారి పొడుగునా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తల సౌకర్యం కోసం ప్రత్యేకంగా బస్సును ఏర్పాటుచేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలకు చెందిన యువత తమ సొంత వాహనాలతో హల్చల్ చేశారు.ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ప్రాంతం కావడంతో పెద్దగా ఇబ్బందులు లేకుండానే కార్యకర్తలు అద్వయ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు.











Leave a Reply