
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్ మెట్రోరైలును తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసేందుకు సీఎస్ రామకృష్ణా రావ్ ఆధ్వర్యంలో కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది. కమిటీలో 10 మంది సభ్యులున్నారు. హెఎంఆర్ఎల్ ఎండీగా ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్కు బాధ్యతలు అప్పగించింది. అయితే ప్రభుత్వ పరిధిలోకి తీసుకునే ముందే మెట్రో విస్తరణకు ప్రభుత్వం భారీ ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. పాతబస్తీలోని పలు ప్రాంతలకు మెట్రో రైలును అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆ పనులను మొదలు పెట్టింది. రెండో విడత విస్తరణ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.











Leave a Reply