(హైదరాబాద్,న్యూస్ఇన్)
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం సర్కార్ సన్నధమవుతున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపి వేయాలని పిటీషన్ దాఖలైంది. వార్డుల సరిహద్దులను తిరిగి నిర్ధారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ముగ్గురు పిటీషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ప్రభుత్వం చేసిన వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధంగా జరిగిందని పిటీషన్లో పేర్కొన్నారు. 1996 జీవో నంబర్ 570లోని రూల్ నంబర్ 5 ప్రకారం డీలిమిటేషన్ జనాభా లెక్కల ఆధారంగా చేయాలని, ప్రభుత్వం ఆ నిబంధనను ఉల్లంఘించిందని పిటిషన్ దాఖలైంది.అదేవిధంగా 2019లో వచ్చిన తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్లోని సెక్షన్ 6ను కూడా ఉల్లంఘించారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఈ పిటీషన్ పై పిటీషనర్ల వాదనలతో పాటు ప్రభుత్వ వాదనలు విన్న కోర్టు విచారణనను వాయిదా వేసింది.












Leave a Reply