NewsInn

News in a Click

2023 లో రేవంత్ రెడ్డి విజయ రహస్యం అదే…!

2023 లో రేవంత్ రెడ్డి విజయ రహస్యం అదే…!

(హైదరాబాద్,న్యూస్ఇన్)

సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో విజయం సాధించడం వెనుక ఉన్న రహస్యాన్ని టిఆర్ఎస్ అధినేత్రి కవిత బయటపెట్టారు. 32వేల పై చిలుకు ఓట్లతో రేవంత్ విజయం సాధించినా…. నియోజకవర్గంలో 33 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని కవిత ఆరోపించారు. విజయం సాధించాలన్న లక్ష్యంగా ముందు నుంచే దొంగ ఓటర్లతో ఓట్లు నమోదు చేసి ఉంటారన్న అనుమానాలను కవిత వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా తాము రెండు నియోజకవర్గాల్లో పరిస్థితులను పరిశీలించినట్లు చెప్పారు. కొడంగల్ , బోధన్ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ఓటర్ల తొలగింపు వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు కవిత మీడియా సమావేశంలో తెలిపారు. కొడంగల్ లో ఉన్న దొంగ ఓట్లు, కొడుకు నియోజకవర్గమైన కర్ణాటకలో కూడా నమోదయి ఉన్నట్లు వెల్లడించారు. కర్ణాటకలోని సేడం, కొడంగల్ నియోజకవర్గాల్లో ఒకే పేరు,ఫోటో తో ఉన్న 11వేల మందికి పైగా ఓటర్లు రెండు నియోజకవర్గాల్లో నమోదైన విషయం తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. గత ఏడాది కాలంలో బోధన్ నియోజకవర్గం లో 7 వేల ఓట్లను తొలగిస్తే, కొడంగల్ నియోజకవర్గం లో కేవలం ఎనిమిది వందల ఓట్లను మాత్రమే తొలగించాలని కవిత ఆరోపించారు.
కేవలం రెండు నియోజకవర్గాల్లోనే తాము అధ్యయనం చేసినట్టు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములను దొంగ ఓట్లు శాసించే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Trs president Kavita

2018 లో కొడంగల్ ఉన్న ఓట్ల సంఖ్యతో పోల్చుకుంటే 2023 నాటికి దాదాపు 30 వేల ఓట్లు పెరిగాయి. పైగా కొడంగల్ కు పక్కనే ఉన్న కర్ణాటకలోని సెడం అనే నియోజకవర్గం నుంచి 11 వేల మంది ఓటర్లు కొడంగల్ లో ఉన్నారు. కొడంగల్ లో ఉన్న డూప్లికేషన్, అదే విధంగా సెడం కు సంబంధించిన 11 వేల ఓట్లు కలిపితే 33 వేల ఓట్లు అవుతున్నాయని కవిత వివరించారు.అంటే డూప్లికేట్, అక్రమంగా రిజస్టర్ చేసుకున్న ఓట్లతో గెలుపు, ఓటములు నిర్ణయించబడుతున్నాయన్నారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి ఏమైనా ఫేవర్ చేసిందా అనే అనుమానం వస్తోందన్నారు. గత ఎన్నికల్లో కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు మాత్రమే కాదు. ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ అయ్యాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం ఇంటర్ స్టేట్ మైగ్రేషన్, డూప్లికేషన్ అంశంపై దృష్టి పెట్టాలని కోరారు.

ఈ కారణంగానే ఓటర్ల జాబితా సవరణపై తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని కవిత అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు, తెలంగాణలో నమోదైన ఓటర్లు ఉంటే వీటిని తొలగించే ప్రక్రియ సాధ్యాసాధ్యాలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ జరగకపోతే ఓటర్ల జాబితా సవరణ చేసిన లాభం లేదని స్పష్టం చేశారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే విధానం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.ఓటర్లను తొలగించిన అంశంపై ఈసీ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని కవిత విమర్శించారు.
సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ కు మూడు రాష్ట్రాల్లో ఓటు ఉందని చెబుతున్నారని,ఆ ఓట్లను తొలగించేందుకు ఏడు ఏళ్లు పడితే భోదన్ లో మాత్రం ఏడాదిన్నరలో 7 వేల ఓట్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఓట్లను తొలగించాల్సి వస్తే తొలిగించే ప్రతి ఓటరుకు మూడుసార్లు నోటీసులు ఇవ్వాలని ఈసీ నిబంధన ఉన్నా ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *