NewsInn

News in a Click

సైబరాబాద్ లో 237 డ్రంక్ & డ్రైవ్ కేసులు

సైబరాబాద్ లో 237 డ్రంక్ & డ్రైవ్ కేసులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో 237 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.205 ద్విచక్ర వాహనదారులు,04 ఆటోలు,28 కార్లు, 00 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే —219 మంది 36 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 200 ఎం జీ/100 ఎంఎల్ మధ్య, -05 మంది 201 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 300 ఎం జీ/100 ఎంఎల్ మధ్య, -13 మంది 301 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 550 ఎం జీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్‌ సేవించి పట్టుబడ్డారు.

కోర్టులో హాజ‌రు ప‌రుచ‌నున్న పోలీసులు….

మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్‌ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్‌ 105 (కల్పబుల్‌ హోమిసైడ్‌ నాట్‌ అమౌంటింగ్‌ టు మర్డర్‌) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది.గత వారం (13.07.2026 – 18.07.2026) లో 309 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులను కోర్టులు పరిష్కరించాయి.05 మందికి జరిమానా, జైలు శిక్ష, ఒకిరికి సోషల్‌ సర్వీస్,303 మందికి కోర్టు జరిమానా విధించిన‌ట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *