(హైదరాబాద్,న్యూస్ఇన్)
ట్రాన్స్ కో డీఇ అక్రమాస్తుల లెక్క ఏసీబీ అధికారులు రూ. 400 కోట్లు అని తేల్చారు. ఇది బహిరంగ మార్కెట్ లో వీటి విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.ఈ రోజు ఉదయం మాధాపూర్ లో ని వెంకటరమణ నివాసంతో పాటు కార్యాలయం, బంధువులు, సన్నిహితులు, బినామిలపై ఏక కాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. దాదాపు 13 గంటల పాటు ఏసీబీ అధికారులు డీఇ నివాసంలో ఒక్కొక్కటి వెలుగు చూడడం అధికారులను ఆశ్యర్య పోయేలా చేసింది. విదేశీ మద్యం బాటిళ్లు, విదేశీ గాడ్జెట్స్ లక్షల రూపాయల విలువ చేసేవిగా గుర్తించారు. వెంకటరమణ అక్రమ ఆస్తులపై ఎన్నో ఫిర్యాదులు అందుకోవడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

2019 లో ముత్యం వెంకటరమణ 26 లక్షల రుపాయాలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. రమణ సతీమణి భార్య స్వప్ప పూఏరుతో నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. మూసాపేట, ఆంజనేయ నగర్ లలో 10 చోట్ల నిర్మాణాల్లో ఉన్నట్లు తేల్చారు. వీటితో పాటు ఖానామెంట్ లో ఐదంతస్తుల వాణిజ్య సమూదా,ం మూసాపేటలో నాలుగు రెసిడెన్షియల్ ప్లాట్లు జీ 3 వాణిజ్య భవనాలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నివాసంలో నగదు తో పాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మూడు విలువైన కార్లు కూడా ఆయన నివాసంలో గుర్తించారు. ట్రాన్స్ కో డీఇ ఉంటూ రెడ్కో లో డిప్యూటేషన్ పై ఆయన ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.













Leave a Reply