
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తన సతీమణి నిర్మలా జగ్గారెడ్డి పోటీ చేస్తారని, తాను సంగారెడ్డిలో పోటీ చేసేది లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి ప్రకటించారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంతా తప్పుగా అర్ధం చేసుకున్నారని, మరో మూడు నాలుగేళ్ల తరువాత జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారన్నారు. తనకు మహేష్ కుమార్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులు సంగారెడ్డికే పరిమతం అయ్యానన్నారు. క్యాబినెట్లో రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తే తప్పేమి కాదన్నారు. అన్నదమ్మలు ఇద్దరు మంత్రి వర్గంలో ఉంటే ఇబ్బంది ఏమటని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డిని తాను కోరినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఈ నెల 30 లేదా వచ్చే నెల లో సంగారెడ్డి పర్యటనకు వస్తానని హామీ ఇచ్చారన్నారు. మంత్రి పొంగులేటిపై బీఆర్ ఎస్ నేతలు లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.తమ ప్రభుత్వ హాయంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే…బీఆర్ ఎస్ ఆ భూములను ఇతరలకు కట్టబెట్టిందన్నారు. హరీష్ రావ్ భూ వివాదాలపై లేని పోని ఆరోపణలు చేస్తే….బీఆర్ ఎస్ హాయంలో జరిగిన అన్ని వివరాలు బయటపెడుతాని జగ్గారెడ్డి హెచ్చరించారు. తాను భూ వివాదాల్లో ఎక్కడా జోక్యం చేసుకోలేదన్నారు. తనపై విమర్శలు చేస్తూ సహించేది లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసే వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీతక్క శాఖలో సెల్ ఫోన్ల కొనుగోలులో కుంభకోణం జరిగిందని బీఆర్ ఎస్ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టెండర్ లేకుండానే సెల్ ఫోన్లు ఎక్కడైనా కొనడం సాధ్యం అవుతందా అని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే చిన్న రాష్ట్రాల ఉనికికే ప్రమాదంగా మారుతుందన్నారు. దీనిపై బీజేపీ నేతులు ఎందుకు మాట్లాడరని జగ్గారెడ్డి ప్రశ్నించారు.










Leave a Reply