NewsInn

News in a Click

సింగూరు నుంచి స‌దాశివ‌పేట‌కు తాగునీరు

సింగూరు నుంచి స‌దాశివ‌పేట‌కు తాగునీరు

(మెద‌క్,న్యూస్ఇన్‌)

సదాశివపేట పట్టణంలో తాగునీటి ఎద్ద‌డిని నివారించేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసిన‌ట్లు టీజీఐఐసీ చైర్మ‌న్ నిర్మాలా, జ‌గ్గారెడ్డిలు వెల్ల‌డించారు. ప‌ట్ట‌ణంలో తాగునీటి స‌మ‌స్య నివార‌ణ కోసం త‌మ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. సింగూరు డ్యామ్ నుండి నేరుగా ఇంటింటికి మంజీర నీళ్లు అందేలా ఇంటెక్ వేల్, ఫిల్టర్ బెడ్, ట్యాంకులు, కొత్త పైపులైన్ల నిర్మాణం చేప‌ట్టేందుకు రూ. 135 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేశార‌న్నారు. భ‌విష్య‌త్తు 50 ఏళ్ల‌లో కూడా నీటి ఎద్ద‌డి రాకుండా ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. రాజ‌కీయాల‌కు అతీతంగా వార్డుల వారిగా స‌మ‌స్య‌ల‌ను గుర్తించాల‌ని, వాటిని ప‌రిష్క‌రించేందుకు తాను దృష్టి పెడుతాన‌న్నారు. ప‌ట్ట‌ణానికి చెందిన కౌన్సిల‌ర్లు క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టిస్తూ తాగునీటి ప‌థ‌కంపై అంద‌రి అభిప్రాయాల‌ను తెలుసుకుని మూడు రోజుల్లో తుది నివేదిక ఇవ్వాల‌ని జ‌గ్గారెడ్డి సూచించారు. సింగూరు నుంచి కొత్త పైప్ లైన్ ద్వారా ప‌ట్ట‌ణానికి తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామ‌న్నారు. అధికారులు కూడా ఈ ప్రతిపాద‌న‌ల‌పై ఎమ్మెల్యే, ఎంపీల‌తో చ‌ర్చించి మార్పులు ఏమైనా చేయాల్సి ఉంటే చేసి కు తుది నివేదిక ఇవ్వాల‌న్నారు. ఆ త‌రువాతే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిపి ప్రాజెక్టు ప‌నుల ప్ర‌తిపాద‌న‌ల‌ను అంద‌చేస్తాన‌న్నారు. ప్రాథ‌మికంగా 135 కోట్ల రుపాయాల‌ని చెబుతున్నా….మార్పులు చేర్పుల‌తో నిధులు పెరిగినా ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు మంజూరు చేయించే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని జ‌గ్గారెడ్డి చెప్పారు. కొత్త నీటి ప‌థ‌కానికి ఆమోదం ద‌క్కిన వెంట‌నే రెండేళ్ల‌లో ప‌నులు పూర్తి చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌న్నారు. ఈ స‌మావేశంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ లు, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *