NewsInn

News in a Click

వేస‌వి త‌రువాత మ‌రోసారి ఎన్నిక‌ల న‌గ‌రా

వేస‌వి త‌రువాత మ‌రోసారి ఎన్నిక‌ల న‌గ‌రా

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణలో మ‌రో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు స‌ర్కార్ రెడీ అవుతోంది. జడ్పీటీసీ,ఎంపీటీసీ,ఎన్నికలకు రంగం సిద్ధమైంది,ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. గ‌త ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌లను ప్ర‌భుత్వం పూర్తి చేసింది. రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేస్తుండ‌డంతో మ‌రో సారి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌న్న యోచ‌న‌లో స‌ర్కార్ ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌పై సీరియ‌స్ గా క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఓట‌ర్ల జాబితాను సిద్ధం చేయాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డంతో ఎన్నిక‌లు త్వ‌ర‌లోరావ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది.

మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ ఎన్నిక‌ల‌పై వ్యాఖ్య‌లు చేస్తూ వేస‌వి త‌రువాత ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న సంకేతాలు ఇచ్చారు. ఇప్ప‌టికే ఎన్నిక‌లు నిర్వ‌హించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్నా…. ప‌ద‌వ‌త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్షల కార‌ణంగా ప్ర‌భుత్వం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్ట‌లేదు. ఇక ఆ పరీక్ష‌లు పూర్త‌యి ఫ‌లితాలు కూడా వెల్ల‌డి కావ‌డంతో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వానికి లైన్ క్లియ‌ర్ అయింది.

నియోజకవర్గాల్లోని అద నపు ఓటర్లను గుర్తించి, వారిని సంబంధిత పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా వర్గీకరిం చాలని అధికారులు ఆదేశించారు. డేటాలో ఏవైనా లోపాలు ఉంటే ఈ నెల 23 వ తేదీలోపు స‌రి చేయాల‌ని,ఆ తర్వాత ముసాయి దా జాబితాలను విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటిస్తామని ఎస్‌ఈసీ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *