(హైదరాబాద్,న్యూస్ఇన్)
తూర్పు ఉత్తర ప్రదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి దక్షిణ ఛత్తీస్ ఘడ్ వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సగటు సముద్రం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈ రోజు కూడా కొనసాగుతోంది. మరొక ద్రోణి ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్నాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది.
మహారాష్ట్ర తో పాటు సమీపం లోని తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక ప్రాంతంలో నిన్న ఏర్పడిన యాంటీ సైక్లోనిక్ సర్కులేషన్ ఈరోజు కూడా సగటు సముద్రమట్టం నుండి 3.1 నుండి 5.8 కిమీ మధ్యలో కొనసాగుతోంది.ఈ ప్రభావంతో తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

3 రోజుల వాతావరణం….
రాష్ట్రంలో ఈరోజు,రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతలలో మార్పు లేదు ….
ఈరోజు,రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు గంటకు 30- 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈరోజు రాష్ట్రంలోని ఒకటి రెండు ఉత్తర పశ్చిమ జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులు మరియు వడగళ్ళ తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఉదయం ఎండలు…..సాయంత్రం వానలు…













Leave a Reply