(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ధిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే రీడిజైన్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమివారం మేడి గడ్డ బ్యారేజీని సందర్శించారు. కుంగిన పిల్లర్స్ ను మరమత్తు చేసేందుకు చేపడుతున్న పరీక్షలను సీఎం పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు పై అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని 1975 లో జలగం వెంగళ రావు ఆనాటి మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకున్నారని,వైఎస్ హయాంలో 2009 లో 38, 063 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెట్టారని చెప్పారు.

ప్రాణహిత చేవేళ్లతో ఆర్ధిక, రాజకీయ ప్రయోజనం లేదని కెసీఆర్ రిడిజైనింగ్ పేరుతో పేరు, ఊరు అంచనాలు మార్చారన్నారు. 2016 లో మొదలు పెట్టిన మేడిగడ్డను 2019 లో పూర్తిచేశామని ప్రారంభించారు. ఇది అద్భుతమని భ్రమలు కల్పించి 2018 ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందారని ఆరోపించారు. 2023 లో మేడిగడ్డ కుప్పకూలిందని చెప్పారు. ప్రాజెక్టులో సమస్యలు రాగానే 2023, నవంబర్ 1 న NDSA ప్రాథమిక రిపోర్ట్ కెసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీపై పీసీ ఘోష్ కమిటీ సంపూర్ణ నివేదిక ఇచ్చిందని, ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రానికి తీర్మానం పంపిందని చెప్పారు.

కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కాళేశ్వరంతో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారన్నారు. నెల రోజుల ముందే అధికారులతో, సాంకేతిక నిపుణులతో ఇవాళ సమావేశం పెట్టుకున్నాంమన్నారు. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు హరీశ్ ఢిల్లీకి పరుగెత్తారని సీఎం ఆరోపించారు. కాళేశ్వరంలో దోషులను వదిలేది లేదని సీఎం వ్యాఖ్యలు చేస్తూ…… దోషులను శిక్షించేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళతామన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన ఈ ప్రాజెక్టును వదిలి పెట్టమని మరమ్మత్తులు చేసి నీరు అందిస్తామని ప్రకటించారు.కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం…






Leave a Reply