NewsInn

News in a Click

ఆల‌య అభివృద్ధి ప‌నులు ప్రారంభించిన సీఎం

ఆల‌య అభివృద్ధి ప‌నులు ప్రారంభించిన సీఎం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర దేవాలయం 198 కోట్ల వ్యయంతో ఆలయ అభి వృద్ధి నిర్మాణ పనులకు , 3.70 కోట్లతో నిర్మించనున్న కాలేశ్వర బస్ స్టేషన్ శంకుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, ఎంపీ వంశీకృష్ణ లు. మేడిగ‌డ్డ బ్యారేజ్ సంద‌ర్శ‌న కోసం భూపాల ప‌ల్లి జిల్లాలో ప‌ర్య‌టించారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌నతో అత్యంత ప్రాముఖ్య‌త ఉన్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆల‌యంలో మహా రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం శుభానంద దేవి ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆలయ శేష వస్త్రాలు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులకు దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ కమిషనర్ హనుమంతరావు స్వామి వారి తీర్థ ప్రసాదాలు పట్టు వస్త్రాలతో ఘనంగా సన్మానించారు.

ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆలయ పునర్ అభివృద్ధి, నూతన బస్టాండ్ శంకుస్థాపన నిర్మాణ పనులకు చేసి శిలాఫలకాలు ప్రారంభించారు, ఆలయ పునర్ అభివృద్ధి పనుల వివరాలను ముఖ్యమంత్రి గారికి దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు వివరించారు.ఆర్ధిక ప్ర‌యోజ‌నాల కోస‌మే కాళేశ్వ‌రంకు కేసీఆర్ రీడిజైన్ చేశారు……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *