
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు సోమవారం నిర్వహించిన సభలపై తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు. ప్రధానంగా గులాబీ బాస్ కేసీఆర్ ను ఇప్పటి వరకు విమర్శించని కవిత తొలిసారి బీఆర్ ఎస్ అధినేతను టార్గెట్ చేశారు. నిన్నటి సభలో కురవృద్ధుడైన జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని బీఆర్ ఎస్ ఏం సాధించాలని భావిస్తోందని ప్రశ్నించారు. మొత్తం కేసీఆర్ ప్రసంగంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ సభ తీరు చూస్తే వెయ్యేళ్లయినా పార్టీ మరేలా కనిపించడం లేదన్నారు. కేసీఆర్ సభలో నిన్న బీఆర్ ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి… 75 ఏళ్ల వయస్సులో ఏం ప్రజా సేవ చేస్తారని ప్రశ్నించారు. ఎంతో మంది యువకులున్నా…బీఆర్ఎస్ కురవృద్ధులతో ప్రజలకు ఏం న్యాయంచేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని, మహిళా బిల్లు వీగిపోయిన సందర్బంగా మహిళలకు అండగా ఉంటామన్న కనీస ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం లేదన్నారు. ఇంకా ప్రజలను తప్పుబడుతూ తమ ఓటు వేయకుండా తప్పు చేశారని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. జీవన్ రెడ్డి ఉద్యమ నాయకత్వంపై పోటీ చేసిన జీవన్ రెడ్డి తెలంగాణా వ్యతిరేకి అనిఆరోపించారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో జీవన్ రెడ్డిని చేర్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణా ఉద్యమకారుల గురించి బీఆర్ఎస్ సభలో ఒక్క మాట చెప్పలేదన్నారు. ఉద్యమకారులు బిక్షాటన చేసేందుకు సిద్దం అవుతుండడం తనకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ సభ అంతే….
సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలోకి పిట్ట కథలతో మభ్య పెట్టారన్నారు. గుంటనక్క ఢిల్లీకి వెళితే… గుంపు మేస్త్రీ బ్లాక్ మేయిల్ చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ సభలో సీఎం రేవంత్ లెక్కలేని తనం ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రజల నిర్ణయాలను తప్పుబట్టడం భావ్యం కాదన్నారు.
25 సభను విజయవంతం చేయండి…..
కొత్త తరం రాజకీయం చేయాలన్న లక్ష్యంగా తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నాన, ప్రజలు ఈ పార్టీని ఆశీర్వదీంచాలని కోరారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు మునిరాబాద్ లో జరిగే ఆవిర్భావ సభను విజయవంతం చేయాలన్నారు. వృద్ధులతో తాను రాజకీయ పార్టీ నడిపించనని, యువతకు పెద్ద పీఠ వేస్తామని ప్రకటించారు.






Leave a Reply