(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం సడలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం వెల్లడించిన ఆదేశాల ప్రకటించారు. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు బదిలీ ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేవించింది. ఇందుకు సంబంధించి పలు విధి విధానాలను ప్రభుత్వం సూచించింది. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, నియమావళి ప్రకారమే బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. జూన్ ఒకటో తేదీ నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం ఉంటుందని ఉత్తర్వులోనే ప్రభుత్వం పేర్కొంది.
ఉద్యగోల బదిలీలకు మార్గదర్శకాలు…..

3 ఏళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీలకు అర్హులు
ఒకే చోట 4 ఏళ్లు దాటితే తప్పనిసరి బదిలీ
31 మే 2027కి ముందే రిటైర్ అయ్యే వారికి మినహాయింపు
ఒక్కో కేడర్లో గరిష్టంగా 40% మందికే బదిలీలు
భార్యాభర్తలు, వికలాంగులు, వైద్య కారణాలకు ప్రాధాన్యం
క్యాన్సర్, కిడ్నీ, హృదయ శస్త్రచికిత్స వంటి కేసులకు ప్రత్యేక ప్రాధాన్యం
కష్ట ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేసిన వారికి ప్రాధాన్యం
బదిలీలు పూర్తిగా కౌన్సెలింగ్ విధానంలో నిర్వహణ
ఆన్లైన్/వెబ్ ఆధారిత విధానం ద్వారా పారదర్శకతతో బదిలీలు
ఖాళీల జాబితా, అర్హుల జాబితా ముందుగా ప్రకటింపు
ఉద్యోగుల నుంచి 5 ఆప్షన్లు తీసుకోనున్న అధికారులు
కష్ట ప్రాంతాలకు సిబ్బంది లేని పక్షంలో లాటరీ విధానం
బదిలీ ఉత్తర్వులు వచ్చిన 3 రోజుల్లో రిలీవ్ అయినట్లు పరిగణన
జూన్ 1, 2026 నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమలు






Leave a Reply