NewsInn

News in a Click

మాజీ సీఎం నాదెండ్ల క‌న్నుమూత‌…….!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు(90) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో నాదెండ్ల భాస్కర్‌రావు చికిత్స పొందుతూ మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. నాదెండ్ల భాస్కర్‌రావు(Nadendla Bhaskara Rao) 1935 జూన్‌ 23లో గుంటూరులో జన్మించారు. 1978లో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో ఉమ్మడి ఏపీ సీఎంగా కొద్ది రోజులు పని చేశారు. ఎన్టీఆర్‌, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా పని చేశారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నాదేండ్ల భాస్క‌ర్ రావ్ త‌న‌యుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ ఏపీలో ప్ర‌స్తుతం మంత్రి వ‌ర్గంలో ఉన్నారు. భాస్క‌ర్ రావు అంత్య‌క్రియ‌లు నేటి సాయంత్రం పంజాగుట్ట స్మ‌శాన వాటిలో జ‌రుగ‌నున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *