(అమరావతి,న్యూస్ఇన్)
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన మూడురోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం ఇప్పట్ల గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్ తొలుత గ్రామ శివార్లలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

వైయస్ జగన్ ఇప్పట్ల పర్యటన సందర్భంగా గ్రామస్తులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. పులివెందుల నుంచి ఇప్పట్ల వరకు దారిపొడవునా అనేక గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు స్వాగతం పలికారు. వైయస్ జగన్ను కలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు తరలివచ్చారు. ఆయన ప్రయాణం మొత్తం ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, అభివాదం చేస్తూ కొనసాగింది. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను వినడం, ధైర్యం చెప్పడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిస్తూ సాగింది





Leave a Reply