NewsInn

News in a Click

రేప‌టి నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు

రేప‌టి నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణా ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల‌కు వేస‌వి సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం నుంచి సెల‌వులు ఇవ్వాల‌ని విద్యా సంస్థ‌ల‌ను ఆదేశించింది. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌లు శుక్ర‌వారం నుంచి త‌మ విద్యా సంస్థ‌ల‌ను మూసి వేయనున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 11 వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెలవులు ఇస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. జూన్ 12వ తేదీ నుంచి తిరిగి పాఠ‌శాల‌లు తెరుచుకోనున్నాయి. 48 రోజుల పాటు విద్యార్థుల‌కు సెల‌వులు ద‌క్క‌నున్నాయి.

జూన్ 12 నుంచి 2026-2027 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. వేసవి సెలవులు ప్రకటించడంతో పిల్లల చదువుల కోసం పట్టణాల్లో ఉంటున్న వారు.. సొంతూరి ప్రయా ణానికి రెడీ అవుతున్నారు. ఎండల నేపథ్యంలో ముందుగానే సెలవులు ప్రకటించడం పట్ల విద్యా ర్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యా సంవత్సరం చివరి రోజులోపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించా లని, విద్యాశాఖ సూచిం చింది, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగకూడదని విద్యార్థులకు వివరించా లని తెలిపింది,

వేసవి సెలవుల్లో పిల్లలు సము ద్రం, నదులు, చెరువులు, సరస్సులు, కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు పిల్లలపై నిరంతర పర్య వేక్షణ ఉండేలా చూడాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *