NewsInn

News in a Click

నేడు నేడు రాష్ట్రాల్లో పోలింగ్- ఏర్పాట్లు పూర్తి

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌)

రెండు కీల‌క రాష్ట్రాల్లో గురువారం ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. తొలి విడ‌త పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు ఎన్నిక‌ల సంఘం పూర్తి చేసింది. త‌మిళ నాడులోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒకే విడ‌త‌లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ప‌శ్చిమ బంగా లో రెండు విడ‌త‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌త్యంలో రాష్ట్ర ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

రెండు రాష్ట్రాల పోలింగ్ వివ‌రాలు……..

రేపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌
234 నియోజకవర్గాల్లో పోలింగ్‌, పోటీలో 4,023 మంది
85,875 మంది పోలీసులతో భద్రత
తమిళనాడులో ఓటు వేయనున్న 5.73 కోట్ల మంది
75,064 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

రేపు బెంగాల్‌లో తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్
ఎన్నికల బరిలో 1,478 మంది అభ్యర్థులు
2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో భద్రత
8 వేలకుపైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *