
(పాలమూరు, న్యూస్ఇన్)
సమాచారం లేకుండా ప్రజావాణికి గైర్హాజరైన అధికారులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధికారులు సైలెంట్ గా దూరంగా ఉండడాన్ని కలెక్టర్ కుష్బు గుప్తా సీరియస్ గా పరిగణించారు. ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. అన్ని శాఖల అధికారులను ప్రజావాణి కార్యక్రమానికి ఆహ్వానించి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం అన్ని కలెక్టర్ కార్యాలయలతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రజా భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలోని సమస్యల పై ఆయా జిల్లాల ప్రజలు సోమవారం రోజు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజావాణికి పెద్ద ఎత్తున వస్తుంటారు.
నోటీసులు అందుకున్న అధికారులు……
- ఆర్అండ్బీ ఈఈ సంధ్య
- మైనార్టీ సంక్షేమాధికారి ఖయ్యూం
- ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
- మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్
- ఈడ బ్ల్యూయియాబీడీ ఈఈ రాంచందర్
- లీగల్ మెట్రాలజీ అధికారి రవీందర్
- మార్క్ఫెడ్ డీఎం నర్సింహారావు
- సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ డీఈఓ వాణిశ్రీ
- వర్క్స్ ఇన్స్పెక్టర్ రియాజ్




Leave a Reply