NewsInn

News in a Click

ఉస్మాన్ న‌గ‌ర్ లో రాజ‌పుష్ఫ భారీ పెట్టుబ‌డి

ఉస్మాన్ న‌గ‌ర్ లో రాజ‌పుష్ఫ భారీ పెట్టుబ‌డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

హైద‌రాబాద్ పశ్చిమ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ జోరు తగ్గలేదని మ‌రోసారి తేలిపోయింది.TGIIC ఈ-వేలంలో ప్రముఖ నిర్మాణ సంస్థ రాజపుష్ప భారీ ధరకు ఉస్మాన్ న‌గ‌ర్ లో భూమిని దక్కించుకుంది.ప్లాట్ నం.1 కోసం జరిగిన వేలంలో రాజపుష్ప సంస్థ అత్యధికంగా రూ.517 కోట్లు వెచ్చించి 10.09 ఎకరాల భూమిని ద‌క్కించుకుంది. ఎకరా భూమి విలువ సగటున రూ.51.25 కోట్లు పలికినట్లయింది. ఈ ప్రాంతంలో ఇదే భారీ డీల్ గా రియల్ ఎస్టేట్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

కొత్త ప్రాజెక్ట్ ప్లాన్…..

రాజ పుష్ప డైరెక్టర్ భరత్ రాజ్ రెడ్డి మాట్లాడుతూ ఈ భూమి మా టౌన్‌షిప్‌కు ప్రధాన గేట్‌వేలా ఉంటుందన్నారు. ఇక్కడ ప్రీమియం రిటైల్ మాల్‌తో పాటు గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ నిర్మించేందుకు ప్రణాళిక ఉంద‌న్నారు. రాజ పుష్ప సంస్థ తన ప్రతిష్ఠాత్మక ‘రాజ పుష్ప లైఫ్‌స్టైల్ సిటీ’కి ఆనుకుని ఉన్నచోటే అందుబాటులోకి రావ‌డంతో భారీ ధ‌ర పెట్టేందుకు వెనుక‌డుగు వేయ‌లేదు. సుమారు 400 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న భారీ టౌన్‌షిప్‌కు ఈ కొత్త స్థలం ఒక ప్ర‌ధాన ఎంట్రీగా మార‌నుంది. ఈ ప్ర‌దేశంలో ఒక ప్రీమియం షాపింగ్ మాల్‌తో పాటు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీని నిర్మించే యోచ‌న‌లో ఉంది.

ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటంతో ఉస్మాన్ నగర్ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. రాజపుష్ప దక్కించుకున్న ఈ ప్లాట్ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. ఈ భారీ డీల్ తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకుంద‌న్న చ‌ర్చ మొద‌లైంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *