(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఉభయ సభల్లో సభ్యత్వం లేకుండా మంత్రి గా అవకాశం దక్కించుకున్న అజహారుద్దీన్ కు క్యాబినెట్లో కొనసాగేందుకు లైన్ క్లియర్ అయింది. శాసనమండలి సభ్యుడిగా గవర్నర్ కోటాలో ఆమోదం దక్కడంతో శాసనమండలి సభ్యుడుగా నియామకం అయ్యారు.
అజహారుద్దీన్, కోదండరాం ల శాసనమండలి సభ్యుల ఎంపిక విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై గులాబీ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన అమీర్ అలీ ఖాన్, కోదండరాం ల కు స్టే ఇస్తూ కోర్టు ఆదేశించింది. దీంతో నియమాకానికి బ్రేకులు పడ్డాయి.

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రావడంతో మైనార్టీలను దృష్టిలో ఉంచుకుని అంతకు ముందు ఎన్నికల్లో అజహరుద్దీన్ జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాని క్యాబినెట్లో మైనార్టీ సామాజిక వర్గం నుంచి మంత్రి లేకపోవడంతో అజహారుద్దీన్ కు మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారు. ఇదే సమయంలో కోదండరాం కూడా కాంగ్రెస్ పార్టీ పై కోదండరాం కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు రెండేళ్లుగా శాసనమండలి సభ్యుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగింది. అజహారద్దీన్ కు మంత్రి అవకాశం కల్పించడంతో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజహరుద్దీన్ పేరును చేరుస్తూ కోదండరాం ను కొనసాగిస్తూ మరోసారి గవర్నర్ కు ఫైల్ పంపింది.
పెండింగ్ లో ఉన్న శాసనమండలి సభ్యుల ఎన్నికలపై కొత్తగా గవర్నర్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న శివప్రతాప్ శుక్లా క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో అజహరుద్దీన్ కు భారీ ఊరట లభించింది. వారం రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా లోక్ భవన్ కువెళ్లి గవర్నర్ తో చర్చలు జరుపడంతో గవర్నర్ ఆమోదం తెలిపారు.











Leave a Reply