(హైదరాబాద్,న్యూస్ఇన్)
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణా భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి కేటిఆర్ పార్టీ ముఖ్య నేతలు నివాళులర్పించారు. ఈ సందర్బంగా కేటిఆర్ మాట్లాడుతూ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం త్యాగాల పునాదుల మీద ఏర్పాటైన పార్టీ ఇది అని చెప్పారు. అప్పుడు ఉన్న పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా తెలంగాణా ఉద్యమాన్ని మొదలు పెట్టారని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చిన ఆశ్రమం జలదృశ్యంలో జెండా ఎత్తారన్నారు.
అరుదైన చరిత్ర ఉన్న పార్టీ….

మొదటి 14 ఏళ్లు తన పోరాటంతో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి, తెలంగాణ జాతిని మొత్తంగా ఎక్కడికక్కడ లక్షల సంఖ్యలో సమీకరించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ.. అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టుగ పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ గులాబీ పార్టీ అన్నారు.పదేళ్లపాటు ప్రజలు అధికారం ఇస్తే ఒక బాధ్యతగా భావించి రాష్ట్రాన్ని అగ్రభాగాన పదేళ్ల తన పరిపాలనలో నిలబెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.గత రెండున్నర సంవత్సరాలుగా ఈ దుర్మార్గ అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలోని కోట్లాదిమంది అణగారిన వర్గాల బిఆర్ఎస్ పార్టీ గొంతెత్తుందున్నారు. 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు అధికార పార్టీగా, గత రెండున్నరేళ్లు ప్రతిపక్ష పార్టీగా బాధ్యతలు నిర్వహిస్తున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరోసారి ఈరోజు తెలంగాణా కోసం పునరంకితం అవుతున్నామని చెప్పారు. తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్, బిజెపిల నుండి తెలంగాణను మళ్ళీ ఒకసారి పట్టాలెక్కించడానికి కెసిఆర్ నాయకత్వంలో అందరం సమిష్టిగా ఐక్యంగా పోరాటం చేస్తాంమన్నారు. 2028వ సంవత్సరంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ ను ముఖ్యమంత్రి చేసేదాకా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా కలిసికట్టుగా కదం తొక్కుతామన్నారు. మధ్యాహ్నం పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ప్రతినిధుల సభకు హాజరు కానున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పఅనుసరించాల్సిన విధానాలపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.











Leave a Reply