NewsInn

News in a Click

ఏపీ నుంచి తెలంగాణాకు పాకిన పెట్రో కొర‌త‌

ఏపీ నుంచి తెలంగాణాకు పాకిన పెట్రో కొర‌త‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

పెట్రోల్,డీజిల్ ఉత్ప‌త్తుల కొర‌త నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా వేధించింది. పెట్రోల్ బంకుల వ‌ద్ద భారీగా క్యూలైన్లు క‌నిపించాయి. ఇక ఇప్పుడు మ‌రోసారి తెలంగాణా వంతు వ‌చ్చింది. గ‌త నెల రోజుల క్రితం తెలంగాణాలో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. పెట్రో ల్, డీజీల్ కు ఎలాంటి కొర‌త లేద‌ని అధికారులు చెబుతున్నా….ప్ర‌జ‌ల్లో అనుమానాలు తీవ్రం అయ్యాయి. ఇది నిజం అనే విధంగా ప‌లు పెట్రోల్ బంకులు మూత బ‌డుతూ వ‌స్తున్నాయి. దీంతో పెట్రో ఉత్ప‌త్తుల కొర‌త ఉంద‌న్న అనుమానం మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు పెట్రో ఉత్ప‌త్తుల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ ఎలాంటి కొర‌త లేద‌న్న స్ప‌స్ట‌మైన ప్ర‌క‌ట‌లు చేస్తున్నా…. ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న త‌గ్గ‌డం లేదు. తెలంగాణాలో ని ప‌లు ప్రాంతాల్లో కూడా పెట్రోల్ బంక్ ల‌లో నో స్టాక్ అన్న బోర్డులు క‌నిపిస్తూ….భారీగా క్యూలైన్లు ఉండ‌డంతో మ‌రింత ఆందోళ‌న ప్ర‌జ‌ల్లో పెరుగుతోంది.

ఆయిల్ కంపెనీల‌కు బాబు వార్నింగ్….

ఆయిల్ కంపెనీలు ఉన్నపళంగా పాలసీలు మార్చి ఇబ్బంది పెడితే స‌హించేది లేద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొర‌త‌పై స‌మీక్ష నిర్వ‌హించిన బాబు ఆయిల్ కంపెనీల‌కు వార్నింగ్ ఇచ్చారు.ప్రైవేట్ ఆపరేటర్లు కూడా సప్లయ్ నిలిపివేయడంతో సమస్య తీవ్రమైందని కలెక్టర్లు సీఎంకు వివరించారు. కంపెనీలు రిటైల్ ఔట్ లెట్లకు ఇంతకుముందులా క్రెడిట్ ఎందుకు ఇవ్వడం లేద‌ని ఆయిల్ కంపెనీల ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు. ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్ర‌భుత్వ ప‌రంగా ఆయిల్ కంపెనీల‌కు ఇచ్చిన అనుమ‌తుల‌పై పునరాలోచన చేయాల్సి వ‌స్తోంద‌న్న హెచ్చ‌రిక‌లు చేశారు. ఆయిల్ కంపెనీల అసంబద్ద నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందిపడితే సహించేది లేద‌న్నారు.పెట్రోల్, డీజిల్ సరఫరాలో సాధారణ పరిస్థితిని తెచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు సమన్వయంతో పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *